బాలయ్యకి మరో ఛాలెంజ్.. కేటీఆర్ తో కలసి రాబోతున్న రాంచరణ్ ?
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో సీజన్ 2 తిరుగులేని టాక్ షో గా మారుతోంది. సీజన్ 2 ప్రారంభ ఎపిసోడ్ కి మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ హాజరైన సంగతి తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'అన్ స్టాపబుల్' షో సీజన్ 2 తిరుగులేని టాక్ షో గా మారుతోంది. సీజన్ 2 ప్రారంభ ఎపిసోడ్ కి మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ హాజరైన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి ఎపిసోడ్ లకు ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి బిగ్ స్టార్స్ హాజరు కావడంతో అన్ స్టాపబుల్ షో క్రేజీ షో గా దూసుకుపోతోంది.
త్వరలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేసేందుకు ఆహా నిర్వాహకులు సిద్ధం అవుతున్నారు. బాలయ్య, పవన్ ఒకే వేదికపై కనిపించబోతుండడంతో ఈ ఎపిసోడ్ పై ఎక్కడలేని హైప్ నెలకొంది. అయితే అన్ స్టాపబుల్ షో నుంచి మరో క్రేజీ లీక్ వైరల్ గా మారింది.
త్వరలో అన్ స్టాపబుల్ షోకి మెగా పవర్ స్టార్ రాంచరణ్ అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. మరో స్పెషల్ గెస్ట్ తో రాంచరణ్ అన్ స్టాపబుల్ షోకి హాజరు కాబోతున్నారు. పవర్ ఫుల్ లీడర్ కేటీఆర్ తో కలసి చరణ్ ఈ షోలో సందడి చేయబోతున్నాడు. బాలయ్యకి ఇది మరో ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఒకవైపు పాన్ ఇండియా హీరో, మరోవైపు పొలిటీషియన్ కేటీఆర్ ఇద్దరినీ హ్యాండిల్ చేయాలి.
కేటీఆర్, రాంచరణ్ ఇద్దరూ మంచి స్నేహితులు. గతంలో రాంచరణ్ సినిమా ఈవెంట్స్ కి కూడా కేటీఆర్ హాజరయ్యారు. ఇక కేటీఆర్ తో బాలయ్యకి కూడా సత్సంబంధాలు ఉన్నాయి.
కేటీఆర్ ని పొలిటికల్ గా , రాంచరణ్ ని సినిమాల పరంగా ప్రశ్నిస్తూ బాలయ్య ఈ షోని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్ లో రాంచరణ్ ఫోన్ లో బాలయ్యతో మాట్లాడారు. ఈ షోలో హాజరు కావాలని బాలయ్య కోరగా.. మనిద్దరికీ ఒక పిలుపు మాత్రమే దూరం సర్ అని రాంచరణ్ చెప్పాడు.
అన్ స్టాపబుల్ షో లో బాలయ్య గెస్ట్ లని సరదాగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు సంధిస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. మరి బాలయ్య రాంచరణ్, కేటీఆర్ లని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో చూడాలి. త్వరలో ఈ షోలో సంబంధించిన అధికారిక అప్డేట్ రానున్నట్లు టాక్.