స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ రావాలి: మహేష్ హీరోయిన్
లాక్ డౌన్ కాలంలోనూ సోషల్ మీడియాను షేక్ చేసిన మరో సంఘనట బాయ్స్ లాకర్ రూమ్ చాట్. ఢిల్లీకి చెందిన కొందరు విద్యార్థులు ఈ పేరుతో ఓ ఇన్స్టాగ్రామ్ సీక్రెట్ చాట్ రూం క్రియేట్ చేసుకొని అందులో మాట్లాడుకుంటున్నారు. ఆ చాట్ రూమ్లో ఓ అమ్మాయి ఫోటో షేర్ చేసి ఆ అమ్మాయిని ఎలా రేప్ చేయాలని చర్చించుకున్నారు.
అయితే ఆ చాట్కు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయటం ఈ విషయం వెలుగు చూసింది. దీంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. స్కూల్ ఏజ్ విద్యార్దులే ఇలా మాట్లాడుతున్నారంటే టెక్నాలజీ కారణంగా పరిస్థితులు ఏ స్థాయిలో దిగజారుతున్నాయో అర్ధం చేసుకొచ్చంటున్నారు విశ్లేషకులు.
తాజాగా ఈ ఘటనపై హీరోయిన్ కృతి సనన్ స్పందించింది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన కృతి ఈ ఘటనపై తన అభప్రాయాలను వ్యక్తం చేసింది. ప్రముఖ జర్నలిస్ట్ రాజీవ్ మసంద్కు ఇచ్చిన ఆన్లైన్ ఇంటర్య్వూలో ఈ సంఘటనపై మాట్లాడింది కృతి.
బాయ్స్ లాకర్ రూం ఘటన గురించి తెలియగానే ఆ వార్త చదవడానికే ఇబ్బందిగా అనిపించింది. అమ్మాయిల గురించి అబ్బాయిలు, అబ్బాయిల గురించి అమ్మాయిలు మాట్లాడుకోవటం కామనే. సెక్సీ ఉందనుకోవటం వరకు ఓకే కానీ ఇలా హద్దులు దాటి మాట్లాడటం మాత్రం దారుణం. క్యాజువల్గా రేప్ గురించి మాట్లాడటం షాక్కు గురి చేసింది` అంటూ కామెంట్ చేసింది.
సమాజం ఇలాంటి పరిస్థితి నుంచి ఎప్పుడు బయట పడుతుందా అని భయమేసింది. అయితే ఈ పరిస్థితి మారాలంటే మనుషుల ఆలోచనా విధానం మారాలి. ముఖ్యంగా పిల్లలను పెంచే విదానంలోనే మార్పులు రావాలి అన్న అభిప్రాయం వ్యక్తం చేసింది కృతి.
మన సమాజంలో అమ్మాయి కంటే అబ్బాయి ఎక్కువ అనే ధోరణి ఉంది. ముందు అది పోవాలి. అబ్బాయిలకు అమ్మాయిలను గౌరవించే సంస్కారం నేర్పించాలి. అబ్బాయిలను అమ్మాయిలను వేరు వేరుగా చూడటం తల్లి దండ్రులు మానేయాలి అని చెప్పింది.
స్కూల్స్లో సెక్స్ ఎడ్యూకేషన్ను తప్పనిసరి చేయాలి. అప్పుడే అబ్బాయిలు శృంగారం పట్ల తమ ఆలోచనా విధానం మార్చుకుంటారు. అమ్మాయిలు కూడా మనతో సమానం అని భావిస్తారన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.