టిక్టాక్ స్టార్ దుర్గారావుతో స్టెప్పేసిన కార్తికేయ, లావణ్య త్రిపాఠి.. ఫోటోలు
కార్తికేయ, లావణ్య త్రిపాఠి నటించిన `చావు కబురు చల్లగా` చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏపీలో టూర్ నిర్వహిస్తుంది. కాకినాడలో వీరికి టిక్ టాక్ స్టార్ దుర్గారావు జోడయ్యాడు. ఆయనతో కలిసి కార్తికేయ స్టెప్పులేశారు. వీరిని చూసి భారీగా జనం అక్కడికి చేరుకున్నారు.
`చావు కబురు చల్లగా` చిత్ర ప్రమోషన్లో భాగంగా హీరోహీరోయిన్లు కార్తికేయ, లావణ్య త్రిపాఠి టూర్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వైజాగ్ టూర్ కంప్లీట్ చేసుకున్నారు.
తాజాగా కాకినాడలోని పద్మ ప్రియ థియేటర్ వద్ద సందడి చేశారు. అయితే వీరికి మరో ఎట్రాక్షన్ తోడయ్యింది. టిక్ టాక్లో వీడియోలు చేసి పాపులర్ అయిన దుర్గారావు తోడయ్యాడు.
`సీకేసీ` టీమ్కి డాన్సులతో స్వాగతం పలికారు. దీంతో దుర్గారావుతో కలిసి కార్తికేయ , లావణ్య, ఇతర చిత్ర బృందం, అభిమానులు కలిసి స్టెప్పులేశారు.
ఆద్యంతం సందడిగా ఈ టూర్ రన్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సందడి చేస్తున్నాయి.
కార్తికేయ అండ్ చావుకబురుచల్లగా చిత్ర బృందం ఏపీ టూర్.
కార్తికేయ అండ్ చావుకబురుచల్లగా చిత్ర బృందం ఏపీ టూర్.
కార్తికేయ అండ్ చావుకబురుచల్లగా చిత్ర బృందం ఏపీ టూర్.
టూర్లో భాగంగా బస్ డ్రైవ్ చేస్తున్నకార్తికేయ.