'లాడ్జిలో మత్తు ఇచ్చి వీడియోలు తీసి'.. ఎస్పీని కలిసిన కరాటే కల్యాణి
సినీ నటి కరాటే కళ్యాణీ మొదటి నుంచి ఫైర్ బ్రాండే. తనకే కాదు తన చుట్టు ప్రక్కల ఎవరికి అన్యాయం జరిగినా గొంతు విప్పుతుంది. అండగా నిలుస్తుంది. ముఖ్యంగా మహిళలలో ఎవరైనా మోసపోయారని తెలిస్తే వారికి న్యాయం చేసేదాకా పోరాటం చేయటానికి సిద్దపడతారామె. ఆమె మరో పోరాటానికి సిద్ధమయ్యారు. క్యాస్టింగ్ కౌచ్, రామతీర్థం ఘటనలపై ఆమె ఇప్పటికే పోరాటాలు చేశారు. రీసెంట్ గా హరికథ గానంలో తనకు పరిచయమైన యువతి మోసపోయిందని, ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ కరాటే కల్యాణి ఎస్పీని కలిసారు. లవ్ జిహాద్కు గురైన ఓ అమ్మాయికి న్యాయం చేయాలని గట్టిగా పోరాడుతున్నారు.ఇందులో భాగంగా లవ్జిహాద్ పై రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.,...
కళ్యాణి తనతో పాటు బాధితురాలుని తీసుకునిూ బుధవారం గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డిని ఆశ్రయించారు. బాధితురాలి కథనం మేరకు.. గుంటూరు ఏటీ అగ్రహారం ఎనిమిదో లైన్కు చెందిన యువతి 2018లో హరికథ విద్య నిమిత్తం తిరుపతి వెళ్లింది. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన యువకుడు అహ్మద్ తషీఫ్ ఆమెకు పరిచయమయ్యాడు.
2019లో లాడ్జికి తీసుకెళ్లి ఆహారంలో మత్తు మందు కలిపి స్పృహ కోల్పోయిన యువతిపై లైంగిక దాడి చేసి, వీడియోలో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అనంతరం బాధిత యువతి వయోలిన్ విద్య నేర్చుకునేందుకు హైదరాబాద్ వెళ్లగా, అక్కడకు తషీఫ్ వచ్చి మాయమాటలు చెప్పి ఆర్య సమాజంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొద్దిరోజులకు కర్నూల్ జిల్లాలోని తన ఇంటికి తీసుకెళ్లాడు.
యువతికి ఇష్టం లేకుండానే ముస్లిం సంప్రదాయంలో మళ్లీ వివాహం చేశారు. అత్తింటివారు బలవంతంగా మత మార్పిడి చేసుకోవాలని వేధింపులకు పాల్పడుతున్నారు. నిందితులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ కేసు కన్నా ముందు మరో యువతికు న్యాయం చేసేందుకు కళ్యాణి ముందుకు వచ్చారు. ఆల్కాట్ గార్డెన్స్ ప్రాంతంలోని ఒలీవల మందిరం పాస్టర్ షారోన్ కుమార్ తనను మోసం చేశాడని కడియం మండలం రెడ్డిపడల్లి గ్రామానికి చెందిన మద్దుకూరి ప్రింయాక రెండోపట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియాంక ఏడేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి ఒలీవల చర్చికి వెళ్తోంది. అక్కడ పాస్టర్ షారోన్ కుమార్ ఏకాంత ప్రార్థనలను ప్రోత్సహించేవాడు.
తన భార్యతో విడాకులు అయిపోతున్నాయని, నిన్ను ప్రేమిస్తున్నానని నమ్మబలికి శారీరకంగా లోబర్చుకున్నాడు. నగ్నంగా వీడియోలు తీసి తనవద్ద ఉంచుకున్నాడు. ఇప్పుడు ఆ ఫొటోలను బహిర్గతం చేస్తానని భయపెడుతున్నాడు.
దీంతో కొందరి సహకారంతో సినీ ఆర్టిస్ట్ కరాటే కల్యాణిని కలిసి తన బాధ చెప్పుకున్నానని, ఆమె ధైర్యంతో పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశానని ప్రియాంక తెలిపారు.
కరాటే కళ్యాణి... కృష్ణ సినిమాలోని బా..బీ.. డైలాగ్తో ఆమె ఫేమస్ అయ్యారు. ఆ డైలాగ్ జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. కానీ తాను ఆ టైపు కాదని సాంప్రదాయ మహిళ అని చెప్తోంది. ఇక సీమంతం చేసుకోవాలన్నది తన కోరిక అంటోంది.
అందరూ తనను మోసం చేశారని, వాడుకోడానకే చూశారని చేదు సంఘటనలను గుర్తు చేసుకుంది. పిల్లల కోసం ఆరాటపడుతున్న ఆ సమయంలో 'ఓ బాబును కోళ్ల గూడులో పడేసారు, మీరు పెంచుకుంటారా?' అని ఆమెకు వచ్చిన ఫోన్ కాల్ ఆమె బాధలకు ముగింపు పలికింది. మరో ఆలోచనే చేయకుండా వెంటనే బాబును దత్తత తీసుకుని అతడే సర్వస్వంగా ఆలనాపాలనా చూసుకుంటోంది.
క్యాస్టింగ్ కౌచ్ అంశంపై కళ్యాణి మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందనే అభిప్రాయంతో జనం ఉన్నారు. కాని అమ్మాయిలు వర్క్ చేసే ప్రతిచోటా వేధింపులు ఉంటాయి. కొన్ని ప్లేస్లతో కొన్ని కామన్. సాప్ట్వేర్ ఫీల్డ్లో చేతులు వేసినా.. హగ్ చేసినా కిస్ చేసినా చాలా ఈజీగా తీసుకుంటారు. అయితే నేను ఇలా చేయండని ఎంటర్టైన్ చేయడం లేదు. అయితే ఏదైనా మనలోనే ఉంటుంది. మన కట్టు, బొట్టు, మాట్లాడే విధానం ద్వారానే ఎదుటి వారి ప్రవర్తన ఉంటుంది అన్నారు.
నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా మంది అడిగారు. చాలా బాగుంది.. నైట్ ఫ్రీగా ఉంటావా? బయటకు వెళ్తామా అని అడిగారు ఇవన్నీ కామన్గా వస్తుంటాయి. అయితే వాళ్లు షికారుకి వెళ్దామన్నప్పుడు నేను రెడీ అయ్యి వచ్చేస్తే.. వాళ్లు ఇంకొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటారు. వాళ్లు అడిగినప్పుడు నువ్ వెళ్లకు.నేను ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండానే ఇప్పటి వరకూ ఉండగలిగాను.. ఎందుకంటే నేను టాలెంట్ను నమ్ముకున్నాను అంటూ చెప్పుకొచ్చారామె.