జైల్ నుంచి వచ్చాక ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న కన్నడ నటి రాగిణి ద్వివేది..
కన్నడ నటి రాగిణి ద్వివేది డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలుకెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు నెలల తర్వాత రాగిణి జైలు నుంచి విడుదలైంది. జనవరి చివరి వారంలో ఇంటికి చేరుకున్న రాగిని తమ తల్లిదండ్రులతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో వారింట్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
కన్నడ నటి రాగిణి ద్వివేది తెలుగు ఆడియెన్స్ కి కూడా సుపరిచితం. ఆమె తెలుగులో `జెండా పైకపిరాజు` చిత్రంలో నటించింది.
కన్నడ చిత్రాల్లోనే ఎక్కువగా నటించి పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇంట్లో గతేడాది సెప్టెంబర్లో పోలీసులు రైడ్ చేయగా, డ్రగ్స్ దొరికినట్టు నిర్ధారించారు. దీంతో రాగిణిని అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు మరో నటి సంజనాని కూడా అరెస్ట్ చేశారు.
దీంతోపాటు ఈ కన్నడ డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్న చాలా మందిని అరెస్ట్ చేశారు. ఎన్సీబీ అధికారులు ఇన్వెస్టిగేషన్ అనంతరం వీరిని జైలుకి తరలించారు.
అప్పటి నుంచి బెయిల్కి పిటిషన్ చేసుకుంటుండగా ప్రతిసారి కోర్ట్ పిటిషన్ని కొట్టివేస్తూ వచ్చింది. సంజనకి ముందుగానే బెయిల్ లభించగా, రాగిణి విషయంలో నిరాశే ఎదురైంది. ఎట్టకేలకు ఇటీవల జనవరి 21న బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇంటికి చేరుకుంది రాగిణి.
కొత్త ఏడాది జైల్లోనే గడపడంతో ఫ్యామిలీని, ఆ సెలబ్రేషన్ మిస్ అయ్యింది రాగిణి. ఈ నేపథ్యంలో తన పేరెంట్స్, బంధువులతో కలిసి తాజాగా కొత్త ఏడాదిని సెలబ్రేట్చేసుకుంది.
బెయిల్ మంజూరు కావడంతో చాలా హ్యాపీగా ఉంది రాగిణి. నిజానికి తనకు కొత్త ఏడాది ఇప్పుడే వచ్చినట్టుగా భావిస్తుంది. అందుకే నెల తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంది రాగిణి.
అయితే దీనిపై ఆమె స్పందిస్తూ, నేను హ్యపీగా నవ్వితే, ఈ ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతుంది` అని పేర్కొంది.
అదే సమయంలో ఈకష్టకాలంలో తనకు వెన్నంటి ఉండి, సపోర్ట్ చేసిన తమ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్, అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది రాగిణి.
ఆమె ఇంకా చెబుతూ భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి దేశంలో జీవించే హక్కు ఉందని, న్యాయం నా వైపు నిలబడిందని చెప్పింది. ఈ సందర్భంగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పింది. నవ్వుతూ ఉన్న ఫోటోలను షేర్ చేసుకుంది.