నా సోదరికి 54సర్జరీలు చేయించా.. షాకింగ్ విషయాలు వెల్లడించిన కంగనా!
ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సోదరి రంగోలి యాసిడ్ దాడికి గురైన విషయం తెలిసిందే. ప్రేమని ఒప్పుకోనందుకు ప్రేమోన్మాది ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. అయితే ఆమెకి ఇప్పటి వరకు 54 సర్జరీలు చేయించిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగనా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు పలు షాకింగ్ విషయాలు చెప్పింది.
కంగనా రనౌత్ బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్గా రాణిస్తుంది. ఆమె ఇటీవల కాలంలో సమాజంలోని ప్రతి విషయంపై స్పందిస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు విషయంలో,అలాగే డ్రగ్స్ రాకెట్ విషయంలో మహారాష్ట ప్రభుత్వంతోనే ఢీ కొన్నది.
దీంతోపాటు రైతు చట్టాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ఇతర పార్టీలపై, ఇతర సమస్యలపై ఆమె గళమెత్తుతున్నారు. నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. హృతిక్ రోషన్తో డేటింగ్ విషయంలో కూడా వివాదంలో ఇరుక్కుంది కంగనా. అయితే అన్ని విషయాల్లోనూ తన సోదరి రంగోలి కూడా ఆమెకి మద్దతుగా నిలుస్తున్నారు.
అయితే కంగనా సిస్టర్ రంగోలి యాసిడ్ దాడికి గురైన విషయం తెలిసిందే. కంగనా 19ఏళ్ల వయసులో సిస్టర్కి రంగోలిపై కాలేజ్ స్టూడెంట్ అవినాష్ శర్మ యాసిడ్ దాడిచేశాడు. తన లవ్ప్రపోజల్ని ఆమె తిరస్కరించినందుకు అతను ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు.
కానీ ఆ వెంటనే ఆమెకి సర్జరీ చేయించేందుకు వీలు లేదు. ఎందుకంటే ఆ సమయంలో కంగనా ఫ్యామిలీ చాలా పేదరికంలో ఉంది. ఇళ్లు గడవడమే కష్టంగా మారిన పరిస్థితి. అలాంటి టైమ్లో లక్షలు పెట్టి సర్జరీలు చేయించడం సాధ్యం కాలేదు. పైగా ఆమె నటిగా మారాలని తన ఇంటి నుంచి పారిపోయింది. ఆ టైమ్లో అనేక స్ట్రగుల్స్ అనుభవించారు కంగనా ఫ్యామిలీ. కనీసం తమ బాధని తీర్చుకునేందుకు కూర్చొని ప్రశాంతంగా ఏడ్చే టైమ్ కూడా ఉండేది కాదట.
అప్పుడప్పుడే కంగనా సినిమాల్లోకి రావడం, ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో సినీ అవకాశాలు రాకపోవడం, తను సైతం కెరీర్పరంగా స్ట్రగుల్ అవ్వడంతో రంగోలి విషయంలో ఏం చేయలేని నిస్సాయతగా ఉండిందట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగనా పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
తాను నటిగా ఎదిగాక సోదరి రంగోలికి సర్జరీలు చేయించి ఆమె ముఖానికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తుందట. ఇప్పటి వరకు 54 సర్జరీలు చేయించామని, ఇండియాలోనే ది బెస్ట్ డాక్టర్స్ వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటుందని చెప్పింది కంగనా. ఇప్పటికే ఇంకా ఈ ట్రీట్మెంట్ సాగుతుందని చెప్పింది.
కంగనా రనౌత్ ప్రస్తుతం `తలైవి`, `దాఖడ్` వంటి చిత్రాల్లో నటిస్తుంది. జయలలిత జీవితం ఆధారంగా `తలైవి` రూపొందుతుంది. ఇందులో జయలలిత పాత్రలో కంగనా కనిపించనుంది.