షాకింగ్ కామెంట్స్తో స్టార్స్ ని ఇరికించిన ఫైర్ బ్రాండ్
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు విషయంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా బాగా హైలైట్ అవుతుంది. సుశాంత్ మరణానికి నెపోటిజమే కారణమని ఏకంగా ఓ ఉద్యమానికే తెరలేపింది. ఇటీవల సుశాంత్ కేసుకు, డ్రగ్ మాఫియాకి సంబంధం ఉందని తెలిసిన విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో కంగనా ఫోకస్ డ్రగ్స్ వైపు మళ్లింది. బాలీవుడ్లో స్టార్స్ పై తాజాగా సంచలన ఆరోపణలు చేశారు.
బాలీవుడ్లో మాక్సిమమ్ సెలబ్రిటీలు డ్రగ్ తీసుకుంటారని వెల్లడించింది. ఈ మేరకు కంగనా ట్వీట్ చేసింది. అంతేకాదు ఏకంగా స్టార్స్ పేర్లని కూడా వెల్లడించి షాక్కి గురి చేసింది.
కంగనా చెబుతూ, `రణ్వీర్ సింగ్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌశల్ వంటి వారు `కొకైన్ బానిసలు` అనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరందరూ డ్రగ్ టెస్ట్ కి శాంపిల్ ఇవ్వాలి. వీరిపై వస్తోన్న పుకార్లకి స్వస్తి పలకాలని విజ్ఞప్తి చేస్తున్నా. క్లీయర్ శాంపుల్స్ తో ఈ స్టార్స్ అందరూ జనాలకు ఆదర్శనంగా నిలవాలి` అంటూ ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు.
దీనిపై కాలమిస్ట్ అశ్విని మహాజన్ స్పందించారు. జాతీయ అవార్డు ఎంపిక చేయడానికి ముందు వీరందరికీ డ్రగ్ టెస్ట్ చేయాలంటూ కంగనా మంచిడిమాండ్ చేశారని, అలాంటి వారు మనకు రోల మోడల్స్ ఎలా అవుతారని తెలిపారు. అంతేకాదు ఆయన బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్జోహార్, పొలిటికల్ లీడర్ మజిందర్ సింగ్ సిర్సా తామిచ్చిన పార్టీ వీడియో అశ్వినీ ఈ సందర్భంగా షేర్ చేశారు. వీరంతా డ్రగ్స్ తీసుకున్న స్థితిలోనే ఉన్నారన్నారు. ఇందులో రణ్బీర్, అయాన్, విక్కీ, దీపికా పదుకొనె, అర్జున్ కపూర్, మలైకా అరోరా, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్ వంటి వారున్నారు.
డ్రగ్స్ తీసుకుంటే తానెందుకు ఆ వీడియోని షేర్ చేస్తానని కరణ్ తెలిపారు. ఈ వార్తలను ఆయన ఖండించారు. ఆయనపాటు మరికొందరు స్టార్స్ కంగనా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు.
ఈ ఏడాది `పంగా` చిత్రంతో మెరిసిన కంగనా ప్రస్తుతం `తలైవి`, `ధాఖడ్` చిత్రాల్లో నటిస్తుంది. బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె కేరాఫ్గా నిలుస్తున్నారు.