ఫ్యాన్స్ కి కాజల్ బిగ్ షాక్.. వారిని ఆకర్షించేందుకు వేశ్యగా మారుతుందట?
కాజల్ సాహసాలు చేస్తుంది. ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇవ్వబోతుంది. ఉగ్రవాదులను ఆకర్షించేందుకు వేశ్యగా మారబోతుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వైరల్ అవుతుంది.
కాజల్ వేశ్యగా మారడమేంటి? అనుకుంటున్నారా? అవును సినిమా కోసం వేశ్య పాత్రలో నటించబోతుందట. కెరీర్లో ఫస్ట్ టైమ్ ఇలాంటి బోల్డ్ రోల్ చేయబోతుందట కాజల్.
పెళ్లి తర్వాత మరింత బోల్డ్ గా తయారైంది కాజల్. సమంత దారిలోనే గ్లామర్తో పిచ్చెక్కిస్తుంది. వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్లతో షాక్ ఇస్తుంది. నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తుంది.
మరోవైపు సాహసోపేతమైనా పాత్రలను ఎంచుకుంటోంది. అందులో భాగంగా కాజల్ తెలుగులో నాగార్జున సరసన ఓ సినిమా చేస్తుంది. ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకుడు.
ఈ సినిమాలో కాజల్ రా ఏజెంట్ అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు వేశ్యగా అనే వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఈ పాత్రలోని మరో సీక్రెట్ బయటకు వచ్చింది.
కాజల్ రా ఏజెంట్గానే కనిపిస్తుందట. అయితే ఉగ్రవాదులను ఆకట్టుకునేందుకు, వారి నుంచి రహస్యాలను, వారికి సంబంధించి సీక్రెట్స్ ఇండియన్ పోలీసులకు అందించేందుకు వేశ్య గా మారబోతుందట.
తన అందచందాలతో వారిని ఆకట్టుకుంటూ, రొమాన్స్ చేస్తూ అనేక రహస్యాలను కాజల్ పాత్ర చేరవేస్తుందని, అత్యంత సాహసోపేతమైన రోల్ అని టాక్ వినిపిస్తుంది.
కాజల్ కెరీర్లో ఇలాంటి బోల్డ్ రోల్ చేయడం ఇదే ఫస్ట్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో యాక్షన్ కూడా చేయబోతుందట కాజల్. మ్యారేజ్ తర్వాత గ్లామర్కి అతీతంగా పవర్ఫుల్ రోల్స్ తో మెప్పించాలని నిర్ణయించుకున్నట్టుందీ భామ.
సమంత సైతం పెళ్లి తర్వాత సాహసోపేతమైన పాత్రలు చేస్తుంది. `ది ఫ్యామిలీమ్యాన్2` వెబ్సిరీస్లోనూ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో యాక్షన్ సీక్వెన్స్ చేసి అదరగొట్టింది. ఇప్పుడు కాజల్ సైతం అదే పంథాని ఫాలో అవుతున్నట్టు సమాచారం.
ఇక కాజల్ ప్రస్తుతం చిరంజీవితో `ఆచార్య`లో హీరోయిన్గా నటిస్తుంది. తమిళంలో `ఇండియన్ 2`, `హే సినామిక` చిత్రాలు చేస్తుంది. `ఘోస్టీ` అనే మరో సినిమా చేస్తుంది కాజల్.