ఎన్టీఆర్ నెక్ట్స్, ఆ డైరెక్టర్తోనే.. ఏకంగా ఏడాది డేట్స్!
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కథకు ఎన్టీఆర్ ఓకె చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాను కేజీఎఫ్ లెవల్లోనే భారీ స్థాయిలో రూపొందించేందకు ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యంగ్ టైర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కు లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. భారీ చిత్రం కావటంతో ఆర్ఆర్ఆర్కు ఈ ఏడాది అక్టోబర్ వరకు డేట్స్ ఇచ్చాడు తారక్.
ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నట్టుగా ప్రకటించాడు ఎన్టీఆర్. అయితే తాజాగా త్రివిక్రమ్ సినిమా కన్నా ముందు మరో భారీ సినిమాకు తారక్ ఒకే చెప్పినట్టుగా తెలుస్తోంది.
కేజీఎఫ్ సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సాండల్వుడ్ డైరెక్టర్ టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు. ప్రశాంత్ లిస్ట్లో ఎన్టీఆర్ ప్రభాస్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి.
అయితే ఫైనల్గా ప్రశాంత్ కథకు ఎన్టీఆర్ ఓకె చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాను కేజీఎఫ్ లెవల్లోనే భారీ స్థాయిలో రూపొందించేందకు ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రశాంత్ తో తెరకెక్కబోయే పాన్ ఇండియా సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా ఏడాది పాటు బల్క్ డేట్స్ ఇచ్చేశాడట. అయితే ఆ డేట్స్ ఎప్పుడన్న విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా అనుకున్నట్టుగా జనవరి 8, 2021కి రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించటం లేదు.
ఆ సినిమా రిలీజ్ అయితేగానీ ఎన్టీఆర్ ఫ్రీ కాడు. ఆ తరువాత త్రివిక్రమ్ సినిమా ఎలాగూ లైన్లో ఉంది. ముందు త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడా..? లేక ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ముందే చేస్తాడా అన్న విషయం తెలియాల్సి ఉంది.