ఆ బాధ నుండి బయటపడేందుకు సమంత ప్రయత్నం... సోషల్ మీడియా పోస్ట్స్ సారాంశం అదేనా?
స్టార్ హీరోయిన్ సమంత లైఫ్ స్టైల్ లో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ లో మార్పు మనం గమనించవచ్చు. సమంతలో వచ్చిన ఈ మార్పుకు కారణం ఇదే అంటూ... అనేక కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవడం, యోగా వంటి ఉన్నతమైన అలవాట్లు ఆమె దిన చర్యలో ఉంటాయి. విరామం దొరికితే చైతూతో కలిసి టూర్స్ కి వెళుతూ ఉంటారు.
లాక్ డౌన్ సడలింపుల తరువాత చైతూతో పాటు సమంత మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. అక్కడే దాదాపు రెండు వారాలు ఆహ్లాదంగా గడిపారు. అలాగే అక్కినేని వారి ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా సమంత విరివిగా పాల్గొంటారు. 2020లో జరిగిన రానా పెళ్ళిలో సందడి మొత్తం సమంతదే అని చెప్పాలి.
ఒకప్పుడు అలా ఉండే సమంత... ఒంటరి జీవితం గడుపుతున్నట్లు అనిపిస్తుంది. కేవలం పెట్ డాగ్స్, ఫ్రెండ్స్ తో గడుపుతూ అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఉన్నారని సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా అర్థం అవుతుంది.
సమంత విరామ సమయం తన పెట్ డాగ్స్ తో గడుపుతుంది . డాగ్స్ తో ఆమె చిల్లింగ్ మూమెంట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. ఏదో బాధను మర్చిపోవడానికి సమంత ఈ మార్గాన్ని ఎంచుకున్నారా అనే సందేహం కలుగుతుంది.
చైతూతో విడిగా ఉంటున్న సమంత విడాకులకు కూడా సిద్ధమయ్యారని పదుల సంఖ్యలో కథనాలు వెలువడుతున్నా సమంత స్పందించలేదు. జాతీయ మీడియా ఆమె నుండి స్పష్టత రాబట్టని ఎంత ప్రయత్నించినా, ఆమె తప్పించుకున్నారే కానీ, సమాధానం చెప్పడం లేదు.
సమంత, చైతు కలిసి ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు, అన్ని రూమర్స్ కి చెక్ పడుతుంది. కానీ ఈ జంట అలా చేయడం లేదు. అందుకే అనుమానాలు బలపడుతున్నాయి.
ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో పాల్గొనడానికి చైతూ భయపడుతున్నట్లు సమాచారం. సమంత గురించి అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థం కాకనే ఇలా ప్రవర్తిస్తున్నడంటూ వాదనలు వినిపిస్తున్నారు.
తాజాగా సమంత డాగ్ పర్సన్ అనే కోట్ ఉన్న టి షర్ట్ ధరించి, పెట్ డాగ్ తో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోకు క్యాప్షన్స్ గా.. ఒక వేళ మీరు గమనించకపోతే' పెట్టారు. మరి ఈ పోస్ట్ సారాంశం ఏమిటో అర్థం కావడం లేదు.