సుశాంత్ ఫామ్ హౌజ్లో పార్టీ ఫోటోలు.. హుక్కా.. డ్రగ్స్ ఆనవాళ్లు!
దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి సహా పలువురి అరెస్ట్ చేయగా తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సుశాంత్ ఫాం హౌస్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫామ్ హౌస్లో తనిఖీ చేసిన అధికారులకు కొన్ని కీలక విషయాలు తెలిశాయి. ఫామ్ హౌస్లో హుక్కా, డ్రగ్స్ వాడిన ఆనవాళు కనిపించినట్టుగా అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో అధికారులు, సుశాంత్ ఫామ్కు తరుచూ ఎవరు వచ్చేవారు అని విషయం మీద దృష్టి పెట్టారు.
ఫామ్ హౌస్లోని సీసీ టీవీ పుటేజ్, డీవీఆర్లను ఇప్పటికే అధికారులు స్వాధినం చేసుకున్నారు.
ఈ విషయంలో ఇప్పటికే హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ లాంటి వారి పేర్లు బయటకు వచ్చాయి. త్వరలో వీరికి సమన్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
సుశాంత్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న రియా చక్రవర్తి ప్రధానంగా డ్రగ్స్ విషయంలో 25 మంది బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు ఆ 25 మంది సెలబ్రిటీల మీద ప్రత్యేక దృష్టిపెట్టారు.
డ్రగ్స్ విషయంలో సంబంధాలు ఉన్న ఆరుగురిని ముంబై ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇప్పటికే సుశాంత్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరిన్ని కోణాల్లో దర్యాప్తుకు సిద్దమవుతున్నారు.
ఇప్పటివరకు అందిన సమచారం మేరకు డ్వైన్ అనే డ్రగ్ పెడ్లర్తో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్కు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
షోవిక్ స్కూల్మేట్ కరమ్జిత్ సుశాంత్ కోసం షోవిక్కు దాదాపు 10 సార్లు డ్రగ్స్ సప్లయి చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అందుకు సుశాంత్ దగ్గర పనిచేసే దీపేష్ సావంత్, శామ్యూల్ మెరిండాలు కూడా సాయం చేసినట్టుగా గుర్తించారు.
ఇప్పటికే డ్రగ్స్ విషయంలో సంబంధం ఉన్నవారందరినీ అరెస్ట్ చేశారు.