కూతురు అర్హతోపాటు `శాకుంతలం` టీమ్ని సర్ప్రైజ్ చేసిన అల్లు అర్జున్..గారాల పట్టి నటన చూసి మురిసిపోతూ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `శాకుంతలం` యూనిట్ని, ఆయన కూతురు అల్లు అర్హని సర్ప్రైజ్ చేశారు. సెట్లో మెరిసి అందరు అవాక్కయ్యేలా చేశారు. దీంతో టీమ్ ఆనందానికి అవద్దుల్లేవని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయా పిక్స్ వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ.. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న `శాకుంతలం` చిత్రంలో బేబీ భరతగా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె షూటింగ్లో పాల్గొంటుంది.
షూటింగ్లో తాను ఎలా యాక్ట్ చేస్తుందో చూడాలని అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి భావించారు. దీంతో సడెన్గా `శాకుంతలం` సెట్లో ప్రత్యక్షమయ్యారు.
దీంతో `శాకుంతలం` యూనిట్ సర్ప్రైజ్కి గురయ్యారు. బన్నీకి పుష్పగుచ్చంతో వెల్ కమ్ పలికారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్, స్నేహారెడ్డి కలిసి మానిటర్ వద్ద కూర్చొని అల్లు అర్హ యాక్టింగ్ని తిలకించారు.
స్క్రీన్ ముందు అర్హ నటిస్తున్న విధానం చూసి మురిసిపోయారు. ఈసందర్భంగా వారి ఆనందానికి అవధుల్లేవని చెప్పొచ్చు. బన్నీ `శాకుంతలం` సెట్లో సందడి చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ఇందులో మెయిల్ మేల్ లీడ్ చేస్తున్న దేవ్ మోహన్తోనే ప్రత్యేకంగా ముచ్చటించారు బన్నీ. ఈ సందర్భంగా దేవ్ మోహన్ సైతం బన్నీకి ధన్యవాదాలు తెలిపారు.
`లవ్లీ మీటింగ్ యూ అల్లు అర్జున్ గారు` అంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొంటూ ఆయనతో దిగిన ఫోటోలను పంచుకున్నారు దేవ్ మోహన్. ప్రస్తుతం ఆ పిక్స్ సైతం హల్చల్ అవుతున్నాయి.
`శాకుంతలం` చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా, గుణటీమ్ వర్క్స్, శ్రీవెంకటేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై గుణశేఖర్, దిల్రాజు నిర్మిస్తున్నారు.