మీ నవ్వుకి, అందానికి ఆల్వేస్ ఫిదా.. హీటెక్కిస్తున్న అనసూయ లేటెస్ట్ పిక్స్
అనసూయ సోషల్ మీడియాలోకి వచ్చిందంటే నెటిజన్లకి, అభిమానులకు పండగే. వచ్చిన ప్రతి సారి ఏదో ఒక సర్ప్రైజ్ తెస్తుంది. ముఖ్యంగా తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తుంది. ఇప్పుడూ అదే చేసింది.
అనసూయ తాజాగా తన కొత్త ఫోటోలను పంచుకుంది. ఇందులో బ్లూ కలర్ లంగా రెడ్ కలర్ ఓనీలో మెరిసింది. ఎప్పటిలాగే తన కొంటె అందాలను ఫ్యాన్స్ కి ఎరగా వేసింది.
ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే `జబర్దస్త్` షో కోసం ఫోటోలకు పోజులిచ్చింది అనసూయ. వీటిని చూసేందుకు ఆమె అభిమానులు ఎగబడుతున్నారు. కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
నిజం చెప్పాలంటే అనసూయ చాట్ చేసినా, ఫోటోలను పంచుకున్నా.. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చ జరుగుతుంటుంది. ఆమె అందాన్ని పొగుడుతూ కొందరు, ఆమెని విమర్శిస్తూ మరికొందరు కామెంట్ చేస్తూనే ఉంటారు.
ఇందులో భాగంగా కొన్ని వల్గర్ కామెంట్లు కూడా వస్తుంటాయి. వాటిని ఓపికగా చదివి తనదైన స్టయిల్లో స్ట్రాంగ్ రిప్లై ఇస్తుంటుంది హాట్ యాంకర్ అనసూయ. అన్నట్టుగానే ఈ సారి కూడా నెటిజన్లు కామెంట్ చేశారు. అవి భలే ఆసక్తికరంగా ఉండటం విశేషం.
కొన్ని ఆసక్తికర కామెంట్లని ఓ సారి చూస్తే, `జబర్దస్త్ కామెడీ ఓ పార్ట్ అయితే, మీ అందమైన నవ్వు జబర్దస్త్ కి ప్రాణం పోస్తుంది. అనసూయగారు లేకుండా జబర్దస్త్ ని చూడలేం అన్నంతగా.. మీ నవ్వుకి, మీ అందానికి ఆల్వేస్ ఫిదా` అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
`సో నైస్.. మీ స్మైల్ లక్షల వెలుగులనిస్తుంద`ని, `హాయ్ అత్తమ్మ` అని, `లవ్లీ లుక్`, `సో క్యూట్` అని కొందరు, ఆమె నడుమందాలను వర్ణిస్తూ మరికొందరు కామెంట్లు పెట్టారు.
`వాహ్.. మీరు దేవతలా ఉన్నారు. ఎంతో అందంగా కనిపిస్తున్నారు. మీ నవ్వుకు అడిక్ట్ అయ్యామ`ని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ప్రధానంగా చాలా మంది అనసూయ చాలా హాట్ అని, ఆమె నడుముకి ఫిదా అని పేర్కొంటున్నారు.
ఇలా తన అందాలను ఫిదా చేస్తున్న అనసూయకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ట్విట్టర్లో మిలియన్కిపైగా ఫాలోవర్స్ ఉండగా, ఇన్స్టాలో త్వరలో ఒక మిలియన్కి చేరువ కాబోతుంది.
ప్రస్తుతం టీవీ రంగాన్ని ఏలుతున్న యాంకర్లలో అనసూయ ఒకరు. మిగిలిన యాంకర్లతో పోలిస్తే అనసూయకి క్రేజ్ ఎక్కువ. ఆమె కనిపించిన షో మాగ్జిమమ్ హిట్టే అనే టాక్ ఉంది.
తాను షోలో కనిపిస్తే చాలు అని చూసేవాళ్ళు ఉంటారు. హోస్ట్ గా మంచి అభినయంతో మెప్పిస్తూనే తన అందాలతో మైమరపిస్తుంది అనసూయ. అందుకే ఇంతటి అభిమానాన్ని ఏర్పర్చుకుంది.
ఇంతగా పాపులర్ అయిన అనసూయ.. ఇక్కడి వరకు రావడానికి చాలా ఇబ్బందులే పడింది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొనే, వాటిని తట్టుకుని నిలబడింది. ఎదిగింది.
ఓ వైపు టీవీ షోస్తో, మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలతో మెప్పిస్తుంది. రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. సినిమాల్లో `రంగస్థలం`లోని తాను నటించిన రంగమ్మత్త పాత్ర అనసూయకి విశేషమైన గుర్తింపుని తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అనసూయ `ఆచార్య`, `పుష్ప`, `రంగ మార్తాండ` చిత్రాల్లో నటిస్తుంది. అలాగే `జబర్దస్త్` షోతోపాటు `తల్లా పెళ్లామా?, వంటి షోస్కి యాంకర్గా చేస్తుంది.