కరీనా కపూర్ సిస్టర్ కరిష్మా కపూర్ ముంబై అపార్ట్మెంట్ ధర తెలిస్తే షాకే!
స్టార్ సిస్టర్స్ కరీనా, కరిష్మా కొత్త నివాసాలకు షిఫ్ట్ అవుతుండగా... వారు నివసించే ఫ్లాట్స్ ధరలు తెలిసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.
కరీష్మా కపూర్ ప్రస్తుతం ముంబైలోని రోజ్ క్వీన్ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్నారు. 1611 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆ ఫ్లాట్, అపార్ట్మెంట్ లో పదవ ఫ్లోర్ లో ఉంది. ఇందులో నివసిస్తూనే కొత్త ఇంటిని ఆమె డిసెంబర్ 24న రిజిస్టర్ చేశారు.
త్వరలో రెండో బిడ్డకు జన్మను ఇవ్వనున్న కరీనా కపూర్ ఫ్యామిలీ, ప్రస్తుతం నివసిస్తున్న ఫార్చ్యూన్ హైట్స్ అపార్ట్మెంట్స్ నుండి వేరే ఇంటికి వెళ్లనున్నారు. గత 11ఏళ్లుగా సైఫ్ అలీ ఖాన్ ఇక్కడే ఉంటున్నారు. కరీనా మొదటి సంతానం తైమూర్ ఇక్కడే జన్మించారు.
కరీనా- సైఫ్ కొత్త ఇంటికి ఇంటీరియర్ డిజైనర్ గా పని చేస్తున్న దర్శన్ షా, ప్రత్యేకతలు వివరించారు. ఫార్చ్యూన్ హైట్స్ అపార్ట్మెంట్స్ లో ఉన్న సైఫ్ ఇంటికి కొంచెం ఎక్సటెన్షన్ లా కొత్త ఇల్లు ఉంటుంది. వారి పాత ఇంటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే.. కొత్తగా అవసరమైన హంగులతో నూతన ఇంటిని డిజైన్ చేస్తున్నాం అన్నారు. కరీనా త్వరలో కనబోయే బిడ్డతో పాటు, పెద్ద వాడవుతున్న తైమూర్ కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఇంటిలో ఉన్నాయి అన్నారు. అందరికీ బెడ్ రూమ్స్, విశాలవంతమైన హాల్, టెర్రస్, స్విమ్మింగ్ పూల్ వంటి అధునాతన సౌకర్యలు ఉంటాయని అన్నారు.
కరీనా, కరిష్మాలే కాకుండగా బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, జాన్వీ కపూర్ వంటి వాళ్ళు కూడా కొత్తగా ప్రాపర్టీస్ పై పెట్టుబడులు పెట్టారట.
ఇక కరిష్మా కపూర్ సైతం తన పాత ఇంటిని వదిలేసి కొత్త ఇంటికి మారాలనే ఆలోచనలో ఉన్నారట.
తన పాత అపార్ట్మెంట్ ని జాప్కే వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టిన కరిష్మా కపూర్ దాని ధర రూ. 10.11 కోట్లుగా నిర్ణయయించడం జరిగింది.