చిరిగిన స్కర్ట్ లో రెచ్చి పోయి పోజులిచ్చిన అమలా పాల్
మలయాళ బ్యూటీ అమలాపాల్ వెండితెర ఎంట్రీ ఇచ్చి దశాబ్దం అవుతుంది. నీలతామర అనే మలయాళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన అమలాపాల్ తమిళంలో ఎక్కువగా చిత్రాలు చేశారు.
తెలుగులో నాగ చైత్యన్య హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన బెజవాడ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆ మూవీ పరాజయం పొందినా, అమలా పాల్ కి అవకాశాలు వచ్చాయి.
స్టార్ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ కి జంటగా నటించారు అమలా పాల్. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ మూవీలో చరణ్ కి హీరోయిన్ గా నటించింది అమలా పాల్. అలాగే పూరి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఇద్దరు అమ్మాయిలు మూవీలో కూడా అమలాపాల్ హీరోయిన్ గా చేశారు.
ప్రస్తుతం అమలాపాల్ ఎక్కువగా తమిళంలో చిత్రాలు చేస్తున్నారు. కెరీర్ సంగతి ఎలా ఉన్న, వివాదాల పరంగా అమలా పాల్ చాలా ప్రాచుర్యం పొందారు. దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకున్న అమలాపాల్, మూడేళ్లకే విడాకులు ఇచ్చింది.
తాజాగా అమలాపాల్ సింగర్ భవీందర్ సింగర్ పై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఓ షూట్ కోసం అతనితో సన్నిహితంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకొని, తన పరువుకు నష్టం కలిగించాడని మద్రాస్ హై కోర్ట్ లో పిటీషన్ వేశారు.
ఈ కేసులో మద్రాస్ హై కోర్ట్ అమలాపాల్ కి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడానికి వీలు లేదని భవీందర్ సింగ్ ని ఆదేశించడం జరిగింది.
ఇక తాజా ఫోటో షూట్ లో హాట్ ఫోజులతో అమలాపాల్ రెచ్చిపోయింది. టోర్న్ జీన్స్ స్కర్ట్ టాప్ ధరించి రచ్చ లేపింది.
అమలాపాల్ మాస్ అండ్ సెక్సీ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.