#Chiranjeevi: చిరంజీవి వివాదంపై స్పందించిన గరికపాటి.. ఏమన్నారంటే..
'అక్కడ మొత్తం ఫోటో సెషన్ ఆగిపోవాలి. నాకేం మోహమాటం లేదు. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి. ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడకు రావాలి. లేదంటే నాకు సెలవిప్పించండి' అంటూ వెళ్లిపోతా' అంటూ గట్టిగానే చెప్పారు.
Chiranjeevi vs Garikapati
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సారథ్యంలో గురువారం జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఓ వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు అనేక సినీ రాజకీయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు వ్యాఖ్యలు చిన్నపాటి వివాదానికి దారితీశాయి. దీని నిమిత్తం చిరంజీవి అభిమానులు సోషల్ మీడియాలో గరికపాటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Chiranjeevi vs Garikapati
ఈ నేపథ్యంలో రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు భవానీ కుమార్ శుక్రవారం ఫోనులో గరకిపాటితో మాట్లాడారు. చిరంజీవి పట్ల మీరు వ్యవహరించిన వైనం తమకు బాధ కలిగించిందని, అభిమానుల్లో ఆగ్రహం కలిగినా వారిని శాంతింపజేశామని ప్రవచనకర్తకు చెప్పారు. పైగా, ఎక్కడైనా మెగా ఫ్యాన్స్ ఇబ్బంది కలిగించారా? అని గరికపాటిని భవానీ కుమార్ ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని గరికపాటి సమాధానమిచ్చారు.
Chiranjeevi vs Garikapati
అంతేకాకుండా, ఎవరూ తనను ఇబ్బంది పెట్టలేదన్నారు. చిరంజీవి ఎంతో సహృదయుడని, ఈ విషయంపై ఆయనతో మాట్లాడుతానని గరికపాటి వివరణ ఇచ్చారు. పైగా, ఈ విషయం అందరికీ చెప్పండి. ఇవాళే తప్పకుండా మాట్లాడుతాని భవానీ కుమార్కు తెలిపారు. వీరిద్దరి మధ్య జరిగిన సంబాషణలకు సంబంధించిన వీడియోను భవానీ కుమార్ విడుదల చేశారు.
Chiranjeevi vs Garikapati
వివాద విషయంలోకి వెళితే... దసరా పండుగ నేపథ్యంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, పలువురు ప్రముఖలు హాజరయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అలయ్ బలయ్కు వచ్చిన చిరంజీవితో అభిమానులు ఫోటో లు దిగారు.
మెగాస్టార్తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు చిరంజీవితో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు.
'అక్కడ మొత్తం ఫోటో సెషన్ ఆగిపోవాలి. నాకేం మోహమాటం లేదు. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి. ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడకు రావాలి. లేదంటే నాకు సెలవిప్పించండి' అంటూ వెళ్లిపోతా' అంటూ గట్టిగానే చెప్పారు. వెంటనే అక్కడున్న వారు ఆయనకు సర్ధిచెప్పారు.
అంతేగాక సెల్ఫీలు ఆపి గరికపాటికి చిరంజీవి క్షమాపణ చెప్పారు. గరికపాటి ప్రసంగాలంటే తనకు ఇష్టమని, ఆసక్తిగా వింటానని చెప్పారు. ఒకరోజు తమ ఇంటికి భోజనానికి రావాలని గరికపాటిని చిరంజీవి ఆహ్వానించారు.
'అలయ్ బలయ్' కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన గరికపాటి నరసింహా రావుపై మెగా బ్రదర్ నాగబాబు సెటైర్ వేశారు. ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారని జనాలు భావిస్తున్నారు. ''ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే'' అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ప్రముఖ ప్రవచనకర్తను ఉద్దేశించి చేసినదేనని భావిస్తున్నారు. చిరంజీవిపై సీరియస్ అయిన గరికపాటిని ఉద్దేశించి నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ జోరుగా సాగుతోంది. అన్నయ్యపై చేసిన వ్యాఖ్యలకు ఆయన హార్ట్ అయ్యారట.
సినిమా హీరోలు ఎక్కడికి వెళ్లినా ఫోటోలు దిగడానికి అభిమానులు ఎగబడటం సహజమే. కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ.. హీరోలు ఒప్పిగ్గా ఫోటోలు ఇస్తుంటారు. లేదంటే వాళ్ళను ట్రోల్ చేస్తారు. ఫోటోలు ఇస్తున్నందుకు గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయనపై మెగా ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఆయనకు 'గిరిగిపాటి' అని పేరు పెట్టారు. ఆయన ప్రవచనాలను అడ్డుకుంటామనే ఫోటో కార్డు ఒకటి వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది.
Garikapati narasimharao
గతంలో పుష్ప’ సినిమాపై గరికపాటి నరసింహారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప’ హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పుష్ప’ లాంటి సినిమాల వల్ల సమాజం చెడిపోతోందని గరికపాటి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను తల్లిదండ్రులు హీరోలను చెయ్యవద్దని.. ఇలా చేస్తే వాళ్లు సినిమాలు చూసి చెడిపోతారని చెప్పారు.
Chiranjeevi vs Garikapati
ఇవాళ సినిమాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. రౌడీ, ఇడియట్.. నిన్న కాక మొన్న విజయవంతమైన ‘పుష్ప’ సినిమాలో హీరో ఎవరండి.. ‘స్మగ్లర్’! మరి స్మగ్లింగ్ వాడిని మీరు హీరో చేశారు. ఏమన్నా అంటే.. తర్వాత ఎప్పుడో చివరన 5 నిమిషాలు మంచి చూపిస్తాం.. లేకపోతే ఇంకో పుష్ప 2.. లేకపోతే, పువ్వు 3 అని తీస్తాం అంటారు. అంటే, నువ్వు తీసే వరకు ఇక్కడ సమాజం చెడిపోవాలా.. నాకు అర్థం కాదు!
నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.. నువ్వు పుష్ప 2, 3 తీసే వరకు సమాజం చెడిపోవాలా? ఇప్పటి వరకు స్మగ్లింగ్ గొప్పదే అనుకోరా ఈ సినిమా కారణంగా.. ఆ భావన ఇప్పటికే రాలేదా? పైగా స్మగ్లింగ్ చేసే వాడు ‘తగ్గేదే లే’ అంటాడా! ఈ వేళ అదేదో ఉపనిషత్తు సూక్తి అయిపోయింది. ఇప్పుడు ఎవడో ఓ కుర్రాడు కూడా ఎవర్నో ఒకర్ని గూబమీద కొట్టి ‘తగ్గేదే లే’ అంటున్నాడు. దీనికి ఎవరు కారణమండి?
మరి నాకు కోపమే వస్తుంది.. జరిగింది చెడు అయినప్పుడు నాకు కోపమే వస్తుంది. ఆ హీరోని గాని, ఆ డైరెక్టర్ని గాని నాకు సమాధానం చెప్పమనండి. కడిగేస్తా మొత్తాన్ని! అనుమానమే లేదు.. వాళ్లని కడిగేస్తా. ఇలాంటి డైలాగ్ వల్ల మొత్తం సమాజంలో నేరాలు పెరుగుతున్నాయ్.
తగ్గేదే లే అని ఎవరు అనాలి? హరిశ్చంద్రుడు లాంటి వాడు అనాలి, శ్రీరామ చంద్రుడు లాంటి వాడు వాడాలి.. ఒక స్మగ్లర్ వాడటం ఏంటండి ఆ డైలాగ్? ఇవీ జరుగుతున్న అన్యాయాలు. ఏది సంచలనం చేయాలో అది చేయడం మానేసి.. దుర్మార్గాన్ని సంచలనం చేస్తున్నాం. దొంగతనాన్ని సంచలనం చేస్తున్నాం..
సినిమాలు, సీరియళ్లు ఇలా ఉన్న తరుణంలో.. మీరు పిల్లల్ని హీరో అంటున్నారు. ర్యాంకు వచ్చిన వాడిని హీరో అంటే.. వాడికి ఫస్ట్ గుర్తొచ్చేది సినిమా హీరోనే.. కనీసం క్రికెట్ హీరో కూడా గుర్తు రాడు. వాడు కొంచెం కష్టపడి ఆడతాడు.. వీడిదేం ఉంది?
అందుకే మీ పిల్లలు వెంటనే దొంగతనమైనా చేయొచ్చు.. తాగొచ్చు, సిగరెట్ తాగొచ్చు, మత్తుపదార్థాలు వేసుకోవచ్చు.. వీళ్లంతా హీరోలే! మంచితనం ఉన్నవాడే హీరో. ఎలాంటి దుర్వ్యసనం లేని వాడే హీరో.. అనే సినిమా ఒక్కడైనా వస్తుందా? వచ్చినా ఆడుతుందా? ఆడకపోతే మానెయ్యనివ్వండి.. ఆడటమే ముఖ్యమా? ఆడటమే ముఖ్యం, డబ్బు రావడమే ముఖ్యం అనుకుంటే ప్రపంచమే చెడిపోతుంది. ఆ ధోరణి ఉంటే అలాగే ఉంటుంది. .’’ అని గరికపాటి నరసింహారావు అన్నారు.