- Home
- Entertainment
- మాట నిలబెట్టుకున్న బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్... ఒక్కో కుటుంబానికి ఎంత అంటే?
మాట నిలబెట్టుకున్న బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్... ఒక్కో కుటుంబానికి ఎంత అంటే?
రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మాట నిలుపుకున్నాడు. చెప్పినట్లే పేద రైతు కుటుంబాలకు సహాయం చేస్తున్నాడు. తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలైన పిల్లలను ఆదుకున్నాడు.

Pallavi Prashanth
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఒక హామీ ఇచ్చాడు. టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీతో ఏం చేస్తావని హోస్ట్ నాగార్జున అడిగారు. నేను విన్నర్ అయితే ఆ డబ్బులు పేద రైతులకు సహాయంగా అందిస్తానని చెప్పాడు. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ ఇచ్చిన ఈ హామీ అతని విజయానికి దోహదం చేసింది.
Pallavi Prashanth
విన్నర్ గా టైటిల్ అందుకున్న పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షలు ప్రైజ్ మనీ, ఒక కారు, డైమండ్ నెక్లెస్ గెలుచుకున్నాడు. కాబట్టి హౌస్లో ఇచ్చిన మాట ప్రకారం పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షలు పేదల రైతులకు పంచాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ షో ముగిసిన మూడు నెలలు అవుతుంది. ఆ దిశగా పల్లవి ప్రశాంత్ అడుగులు వేసిన దాఖలాలు లేవు.
Pallavi Prashanth
దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో సీజన్ 2 విన్నర్ ప్రైజ్ మనీ క్యాన్సర్ రోగులకు సహాయంగా ఇస్తానని చెప్పాడు. ఆయన మాట నిలబెట్టుకోలేదనే వాదన ఉంది. పల్లవి ప్రశాంత్ కూడా మాట తప్పాడు. ఇంకెప్పుడు సహాయం చేస్తాడని విమర్శలు వినిపించాయి. ప్రాణం పోయినా మాట తప్పను. త్వరలోనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తానని పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో స్పందించాడు.
Pallavi Prashanth
అన్న మాట ప్రకారం పల్లవి ప్రశాంత్ ఓ పేద రైతు కుటుంబానికి అండగా నిలిచాడు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలో గల కొలుగూరు గ్రామానికి చెందిన రైతు కుటుంబానికి రూ. 1 లక్ష సహాయం చేశాడు. పేద రైతు, అతని భార్య మరణించడంతో పిల్లలు అనాథలు అయ్యారు. పిల్లల పేరిట లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.
Pallavi Prashanth
అలాగే ఏడాదికి సరిపడా బియ్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆట సందీప్ సైతం పాల్గొన్నాడు. ఆయన రూ. 25 వేలు సహాయం చేశారు. కొలుగూరు గ్రామానికి పల్లవి ప్రశాంత్ తో పాటు శివాజీ, భోలే షావలి, సందీప్, ప్రశాంత్ తండ్రి వెళ్లారు.
Pallavi Prashanth
మిగతా డబ్బులు కూడా పేద రైతులకు సహాయం చేసి వీడియోలు పోస్ట్ చేస్తానని పల్లవి ప్రశాంత్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు. పల్లవి ప్రశాంత్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రాణం పోయినా మాట తప్పను అంటున్నాడు.