`ఢీ` వర్షిణి.. ఈటీవీని వదిలేసి స్టార్మాపై పడినట్టుందిగా.. కొత్త షోలో హాట్హాట్గా దుమ్మురేపుతుంది
`ఢీ` ఛాంపియన్తో పాపులర్ అయిన బ్యూటీ వర్షిణి ఈ మధ్య ఈటీవీలో కనిపించడం లేదు. ఆమెని పక్కన పెట్టేశారా? లేక ఆమె పక్కకు వెళ్లిందా? ఏం జరిగిందేమోగానీ ఇప్పుడు మా టీవీపై పడింది. ఓ కొత్త షోలో మాత్రం దుమ్మురేపుతుంది. అందాల విందుతో అద్భుతమైన డాన్స్ లతో కిరాక్ పుట్టిస్తుంది.
వర్షిణి సౌందరాజన్ `ఢీ` షోతో పాపులర్ అయ్యింది. అంతకు ముందు పలు సినిమాలు, షోస్, యాంకరింగ్ చేసినప్పటికీ ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిన షో మాత్రం `ఢీ` అనే చెప్పాలి.
ఓ వైపు రష్మీ గౌతమ్కి, మరోవైపు డాన్సర్లకి పోటీ ఇచ్చిందీ బ్యూటీ. స్టేజ్పై హాట్ షోతో కిర్రాక్పుట్టించింది. కానీ ఈ అమ్మడికి దీపికా పిల్లి రూపంలో దెబ్బ పడింది.
అయితే ఈ షో నుంచి బయటకు పంపించారనే ప్రచారం జరిగింది. మరి ఇందులో నిజమెంతా అనేది పక్కన పెడితే తాజాగా వర్షిణి పెద్ద జాక్ పాట్ కొట్టేసినట్టు కనిపిస్తుంది.
ఈటీవీని పక్కన పెట్టి స్టార్మాపై పడినట్టు కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం `స్టార్మా`లో ఆఫర్ కొట్టేసింది.
ఇందులో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే `కామెడీస్టార్స్` లో ఛాన్స్ కొట్టేసింది. గత ఆదివారం ప్రారంభమైన షోలో అదిరిపోయే స్టెప్పులేసి ఫిదా చేసింది.
ఆమె చేసిన డాన్స్ ఫోటోలను అభిమానులతో పంచుకుని అనందం వ్యక్తం చేసింది వర్షిణి. ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.
హాఫ్ శారీలో అందాల విందుని వడ్డించింది. అంతేకాదు దీనికి ఈ అమ్మడు యాంకర్గా చేస్తున్నట్టు తెలుస్తుంది.
మరి స్టార్ మాలోనైనా కొనసాగుతుందా? లేదో చూడాలి. మొత్తానికి వర్షిణి గ్లామర్తోపాటు టాలెంట్ని కూడా నిరూపించుకోవాలని గట్టిగానే ఫిక్స్ అయ్యిందట.