చిరంజీవి, ఎన్టీఆర్ హీరోయిన్ సమీరా రెడ్డి లవ్, మ్యారేజ్ సీక్రెట్స్ తెలుసా? రేర్ థింగ్స్ వైరల్
చిరంజీవి, ఎన్టీఆర్ హీరోయిన్ సమీరా రెడ్డి పెళ్లికి ముందు లవ్ ఎఫైర్ గురించి తెలుసా? తన భర్త అక్షయ్ వర్దేని మ్యారేజ్ చేసుకోవడానికి ఓ కారణం ఉందట. తాజాగా ఆ సీక్రెట్స్ బయపడ్డాయి. దీంతోపాటు పలు ఆసక్తికర విషయాలు వైరల్గా మారాయి.
ముంబయిలో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీలో జన్మించిన సమీరా రెడ్డి తెలుగులో చిరంజీవితో `జై చిరంజీవ`, ఎన్టీఆర్తో `నరసింహుడు`, `అశోక్` చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాయి.
అయితే బాలీవుడ్లో స్టార్ హీరోగానూ రాణించింది. అందాల విషయంలో ఏమాత్రం దాచుకోకుండా ఆరబోసే ఈ భామ బాలీవుడ్ ఆడియెన్స్ ని ఓ ఊపు ఊపింది. తన అందాలతో తడిసి ముద్ద చేసింది. అయితే ఇప్పుడు సినిమాలు మానేది ఫ్యామిలీకి పరిమితమైన సమీరా గురించి పలు తెలియని విషయాలు వైరల్ అవుతున్నాయి.
హిందీలో `రేస్` చిత్రంతో పాపులర్ అయిన ఈ సెక్సీ భామ 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వెర్దేని వివాహం చేసుకుంది. ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి ముందే రెండేళ్లపాటు డేటింగ్ చేసింది సమీర. అయితే అక్షయ్ మోటర్ సైకిల్ షోరూమ్స్ రన్ చేస్తుంటారు. సమీరాకి బైక్స్ అంటే ఇష్టం. అలా ఆయన ప్రేమలో పడిందట. వీరిద్దరు కలిసి పెళ్లికి ముందు చాలా సార్లు రైడింగ్కి వెళ్లారట.
2014 జనవరి 21న సమీరా, అక్షయ్ ల వివాహం జరిగింది. అయితే పెళ్లి పండపానికి అక్షయ్ కారులోనో, గుర్రంపైనో కాదు, ఏకంగా బైక్పైనే వచ్చారు. దీంతో వీరి పెళ్లి చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఇదిలా ఉంటే పెళ్లికి ముందు క్రికెటర్ ఇషాంత్ శర్మతోనూ సమీరా లవ్ లో ఉన్నట్టు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
సమీరా రెడ్డి 2015లో మొదటి బేబీకి జన్మనిచ్చింది. మే 25న కుమారుడు హాన్స్ జన్మించారు. 2019జులైలో కూతురికి జన్మనిచ్చింది. ప్రస్తుతం వీరిద్దరు పిల్లలతో హ్యాపీగా గడుపుతుంది సమీరారెడ్డి.
సినిమాల నుంచి తప్పుకున్నాక సమీరా రెడ్డి సామాజిక అంశాలపై ఫోకస్ పెట్టింది. ఆమె క్రాయోన్స్, అండ్ డ్రీమ్స్ హోమ్స్ ఎన్టీఓని రన్ చేస్తుంది. అనాథ పిల్లలను చేరదీసి వారికి రక్షణ, కల్పిస్తుంది. బాగోగులు చూసుకుంటోంది.
దీంతోపాటు సమీరా రెడ్డి ఓ యూట్యూబ్ ఛానెల్ని రన్ చేస్తుంది. తన అత్తగారితో కలిసి ఆమె కుక్కింగ్ ఛానెల్ని రన్ చేస్తుంది. వంటలకు సంబంధించిన ఛానెల్ ఇది. లాక్ డౌన్ సమయంలో దీనిపై బాగా ఫోకస్ పెట్టింది సమీర. అందులో చాలా వీడియోలు వైరల్ అయ్యాయి.
1978 డిసెంబర్ 14న జన్మించిన సమీరా రెడ్డి, 1997లో మ్యూజిక్ ఆల్బమ్ అహిష్టతో కెరీర్ని ప్రారంభించింది. ఆ తర్వాత 2002లో హిందీ సినిమా `మైనే దిల్ తుజ్కే దియా` చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. `ప్లాన్`, `ముసఫిర్`, `నక్షా`, `రేస్`, `వన్ టూ త్రీ`, `కాల్పురుష్`, `రెడ్ అలెర్ట్ః ది వార్ వితిన్` చిత్రాల్లో మెరిసింది స్టార్ హీరోగానూ రాణించింది. సమీరా చివరగా కన్నడలో రూపొందిన `వరధనాయకా` చిత్రంలో మెరిసింది.