చిరంజీవి, నాగబాబు, వరుణ్, సాయితేజ్.. `వకీల్సాబ్` మూవీని చూసిన మెగా ఫ్యామిలీ
పవన్ కళ్యాణ్ నటించిన `వకీల్సాబ్` చిత్రాన్ని మెగా ఫ్యామిలీ వీక్షించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, హీరోలు వరుణ్ తేజ్, సాయితేజ్, అలాగే సురేఖా, చిరు తల్లి అంజనాదేవి ఇలా కుటుంబ సభ్యులంతా కలిసి సినిమాని వీక్షించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
పవర్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత `వకీల్సాబ్` చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. `పింక్` రీమేక్గా ఈ సినిమా చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా, దిల్రాజు నిర్మించారు. శుక్రవారం(ఏప్రిల్9)న సినిమా విడుదలై హిట్ టాక్ని తెచ్చుకుంది.
సినిమా బ్లాక్ బస్టర్ అని, టాలీవుడ్లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని క్రిటిక్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి మెగాస్టార్ ఫ్యామిలీ థియేటర్లో సందడి చేశారు. `ఏఎంబీ`లో వీరంతా `వకీల్సాబ్` సినిమాని వీక్షించారు.
ఈ విషయాన్ని చిరంజీవి తెలిపారు. `అమ్మతోపాటు అందరం `వకీల్సాబ్` థియేటర్లో.. షో టైమ్` అని పేర్కొన్నారు.
నాగబాబు కూడా తన సతీమణితో కలిసి సినిమా వీక్షించారు.
మెగాస్టార్ ఇంకా తన రివ్యూని పెట్టలేదు. కానీ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. `బాబాయ్(పవన్) నుంచి పవర్ ప్యాక్డ్ పర్ఫెర్మెన్స్. `వకీల్సాబ్` బాగా నచ్చింది. ముగ్గురు అమ్మాయిల నటన కూడా నాకు బాగా నచ్చింది. దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ కథని అడాప్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగుంది. థమన్ మ్యూజిక్ అసెట్. బీజీఎం అదిరిపోయింది. జస్టీస్ ఈజ్ సర్వ్డ్` అంటూ ఫైర్ ఎమోజీలను పంచుకున్నాడు వరుణ్.
సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ ప్రశంసలు కురిపించారు. `అబ్జెక్షన్.. అబ్జెక్షన్.. అబ్జెక్షన్.. వాటే పవర్ ప్యాక్డ్ పర్ఫెర్మెన్స్. పవన్ కళ్యాణ్ మామ అద్భుతంగా చేశారు. ఈ సినిమా చేయడానికి ఆయన సరైన వ్యక్తి. ఆయనకిది సరైన మూవీ. ఇది కరెక్ట్ టైమ్. బ్లాక్బస్టర్ వకీల్సాబ్` అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు యంగ్ హీరో నిఖిల్ సైతం తన ఫ్యామిలీతో సినిమా చూశారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో `వకీల్సాబ్` సినిమా చూస్తున్నా. బాగా ఎంజాయ్ చేస్తున్నా. ముఖ్యంగా సూపర్ ఉమెన్ ఇన్స్పెక్టర్ ఎపిసోడ్ అదిరిపోయింది.