సెక్సీ యోగాతో చెమటలు పట్టిస్తున్న ఛార్మి.. ఆ పోజ్ చూస్తే మతిపోవాల్సిందే!
ఛార్మి మాజీ నటి, ప్రస్తుత నిర్మాత. హీరోయిన్గా దాదాపు స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడిన ఛార్మి తాజాగా సెక్సీ యోగా పోజ్ ఇచ్చి కుర్రాళ్లలో హీటుని అమాంతం పెంచేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఛార్మి ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం నటనకు దూరమై నిర్మాతగా తన ప్యాషన్ని చాటుకుంటోంది. నిర్మాతగా బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈ అందాల భామ యోగా పోజ్ ఇచ్చింది.
ఛార్మి సెక్సీ యోగా పోజ్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుని నెట్టింట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెంచేసింది. వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ బ్యూటీ చాలా కష్టపడుతుంది.
కానీ ఛార్మి పంచుకున్న యోగా పోజులే ఇప్పుడు వైరల్గా మారాయి. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నాయి. అత్యంత హాట్ పోజు దుమారం రేపుతుంది.
తన పెట్ డాగ్తో కలిసి ఛార్మి బరువు తగ్గే ప్రోగ్రామ్ పెట్టుకుంది. మరోవైపు పాజిటివ్ స్పిరిట్తో ముందుకు సాగాలని చెప్పింది. కరోనా నేపథ్యంలో ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని చెప్పింది.
ఛార్మి యోగా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
2002లో `నీతోడు కావాలి` అనే చిత్రంతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయిన ఛార్మి, `శ్రీ ఆంజనేయం`, `గౌరీ`, `చంటి`, `మాస్`, `చక్రం`, `అనుకోకుండా ఒక రోజు`, `పొలిటికల్ రౌడీ`, `అల్లరి పిడుగు`, `చుక్కల్లో చంద్రుడు`, `లక్ష్మీ`, `స్టైల్`, `పౌర్ణమి`, `చిన్నోడు`, `రాఖీ`, `మంత్ర`, `సుందరాకాండ`, `మైఖేల్ మదన కామరాజు`, `మనోరమ`, `దొంగలమూట`, `మంగళ` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
నితిన్, ప్రభాస్, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, జగపతిబాబు, బాలకృష్ణ, సుమంత్, శ్రీకాంత్ ఇలా దాదాపు చాలా మంది స్టార్ హీరోలతో ఆడిపాడింది. హీరోయిన్గా రిటైర్ మెంట్ తీసుకున్న ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ ల్లోనూ మెరిసింది. ఇప్పుడు నిర్మాతగా మారింది.
పెళ్లికి దూరంగా ఉన్న ఛార్మి.. దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి పనిచేస్తుంది. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్ల నిర్మాణ పనులు చూసుకుంటోంది.
`జ్యోతిలక్ష్మీ` చిత్రంతో నిర్మాతగా మారిన ఈ అమ్మడు పూరీ జగన్నాథ్ సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీ కాంబినేషన్లో వస్తోన్న పాన్ ఇండియా సినిమా `లైగర్`ని నిర్మిస్తుంది.