కియారాకు కిస్ ఇచ్చిన ప్రియుడు వరుణ్ ధావణ్, కంట్రోల్ చేసుకోలేకపోయావా అంటూ.. ట్రోలింగ్
బాలీవుడ్ లవ్ కపుల్ కియారా అద్వాని- వరుణ్ ధావన్ ఎప్పటికప్పుడు ఏదొ ఒక హాట్ న్యూస్ తో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఇక రీసెంట్ గా కియారాకు కిస్ ఇచ్చి మరోసారి సోషల్ మీడియాలో హడావిడి చేశాడు యంగ్ హీరో.
బాలీవుడ్ లో ఉన్న మోస్ట్ రోమాంటిక్ కపుల్స్ లో కియారా అద్వాని- వరుణ్ ధావణ్ కపుల్ ముందు వరుసలో ఉంటుంది. అయితే వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నా.. ఏరోజు ఆ విషయాన్ని ఒప్పుకోలేదు జంట. బయట మాత్రం చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు.
ఈమధ్య వీరిద్దరు విడిపోయారంటూ హాట్ న్యూస్ బాలీవుడ్ లో హల్ చల్ చేసింది. పెళ్ళి చేసుకోబోతున్నారంటకదా..అని కియారాను మీడియా ప్రశ్నించగా.. పెళ్లి లేకపోతే..బ్రతకలేమా అంటూ కియారా ఎదురుప్రశ్న కూడా వేసింది. ఇక ఇదే సమయంలో రీసెంట్ గా వీరి మధ్య జరిగిన ఓ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
ఈ ప్రేమ జంట కలిసి ఒక మేగజైన్ కవర్ ఫొటో కోసం ఫోజులిచ్చారు. ఈ ఫొటో షూట్లో వరుణ్ ధావణ్ .. కియారా ను హగ్ చేసుకుని స్టిల్స్ ఇస్తున్నాడు. ఇక సడెన్ గా అదే టైమ్ లో ..హఠాత్తుగా కియారా బుగ్గపై వరుణ్ ధావన్ ముద్దు పెట్టాడు. అనుకోని పరిణామానికి షాక్ అయిన స్టార్ హీరోయిన్ నవ్వుతూ.. వరుణ్ ను పక్కు నెట్టేసింది.
ఈ ఫొటో షూట్ వీడియోను బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకు 'షూటింగ్ సమయంలో కంట్రోల్ చేసుకోకపోతే ఇలాంటివే జరుగుతాయి అని ఈ పోస్ట్ సంబంధించి నోట్ రాశాడు కమాల్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి కూడా.
నెట్టింట ఈ వీడియో వైరల్ అవగా.. అది చూసిన సోషల్ మీడియా జనాలు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇలా అయితే కష్టం గురూ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఈ జంట ఫుల్ బిజీగా ఉన్నారు.
వరుణ్ ధావన్. వరుసగా లవ్ స్టోరీలు చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడూ.. ఫ్యామిలీ కథలు కూడా చేస్తున్నాడు వరుణ్. అటు కియారా కూడా వరుసగా సినిమాలకుసైన్ చేస్తోంది. టాలీవుడ్ లో రామ్ చరణ్ జోడీగా పాన్ ఇండియా మూవీ చేస్తోంది కియారా.
ఇక రీసెంట్ గా వరుణ్ ధావన్- కియారా అద్వాని నటించిన జుగ్ జుగ్ జీయో మూవీ రిలీజ్ అయ్యింది. జూన్ 24న రిలీజ్ అయిన ఈసినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వందకోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సూప్ సక్కెస్ అందుకుంది.