సంతోషమే ముఖ్యం, విడాకులు తప్పేం కాదు... బిగ్ బాస్ బ్యూటీ క్రేజీ కామెంట్స్!
బాలీవుడ్ బ్యూటీ మినీషా లంబా పెళ్లి , ప్రేమ మరియు వివాహ బంధంపై కొన్ని క్రేజీ కామెంట్స్ చేశారు. బంధం ఏదైనా సంతోషంగా లేకపోతే విడిపోవడమే మంచిది అన్నారు.
గత ఏడాది అధికారికంగా భర్తతో విడాకులు తీసుకొని విడిపోయిన మినీషా లంబా వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
2005లో విడుదలైన రొమాంటిక్ ఎంటర్టైనర్ యహాన్ మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు మినీషా లంబా. కేరీర్ బిగినింగ్ నుండి చిన్న, మధ్యతరహా చిత్రాలలో అవకాశాలు మాత్రమే మినీషాకు దక్కాయి.
2017వరకు అడపాదడపా పాత్రలతో నెట్టుకొచ్చిన మినీషా లంబా... తరువాత ఫేడ్ అవుట్ అయ్యారు. 2017లో సంజయ్ దత్ హీరోగా వచ్చిన భూమి ఆమె చివరి చిత్రం.
2014లో మినీషా లంబా బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. హిందీ బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొన్న మినీషా లంబా, దాదాపు ఏడు వరాలూ హౌస్ లో ఉన్నారు.
ఇక 2015 వ్యాపారవేత్త రియాన్ థామ్ ని మినీషా ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడేళ్ళ దాంపత్య జీవితం తరువాత మినీషా భర్తతో 2018లో విడిపోయారు.
2020లో అధికారికంగా వీరికి విడాకులు మంజూరు కావడం జరిగింది.
కాగా స్నేహమైనా, ప్రేమైనా లేదా పెళ్లి అయినా సంతోషంగా లేకపోతే విడిపోవడమే మంచిదని మినీషా తెలియజేశారు. విడిపోవడం అనేది నేరం కాదని, సంతోషంగా ఉండడానికి అదొక మార్గం అని ఆమె అన్నారు.
ఆడవాళ్ళు ప్రేమ విషయంలో ఓపెన్ గా ఉండడంలో తప్పులేదన్న మినీషా.. సంతోషంగా ఉండడానికి ఇష్టమైన నిర్ణయం తీసుకోవడంలో తప్పు లేదన్నారు. మినీషా తాజా వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.