ఆకాశవాణి నుంచి తప్పుకున్న రాజమౌళి కొడుకు
దర్శక ధీరుడు రాజమౌళి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు కార్తికేయ . బాహుబలి లాంటి భారీ చిత్రానికి సెకండ్ యూనిట్ దర్శకుడిగా వ్యవహరించిన కార్తికేయ తన సంస్థ ద్వారా సినిమా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అయితే తాజాగా కార్తికేయ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ సినిమానుంచి ఆయన తప్పుకున్నాడు.
రాజమౌళి తనయుడిగా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యాడు కార్తికేయ. ముఖ్యంగా బాహుబలి సినిమాతో సెకండ్ యూనిట్ దర్శకుడిగా అందరికీ పరిచయం అయ్యాడు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే సొంతగా ఓ కంపెనీని ప్రారంభించాడు.
తన సొంత సంస్థ ద్వారా పలు చిత్రాల ప్రమోషన్లో భాగంగా యాడ్స్ కట్ చేయటం. ప్రమోషన్ ప్లాన్ డిజైన్ చేయటం లాంటి పనులు చేస్తున్నాడు. అదే సమయంలో నిర్మాతగానూ మారాడు కార్తికేయ.
కార్తికేయ నిర్మాతగా ప్రారంభమైన సినిమా ఆకాశవాణి. తన స్నేహితుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను ప్రారంభించాడు కార్తికేయ. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయ్యింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి కార్తికేయ తప్పుకున్నట్టుగా చిత్ర దర్శకుడు అశ్విన్ గంగరాజు ఓ ప్రకటన ద్వారా తెలిపాడు.
ఆకాశవాణి సినిమాను నా కలగా భావించాను. ఆ సమయంలో కార్తికేయ మా టీంతో కలవటంతో సినిమా స్థాయి పెరిగింది. కార్తికేయతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవనాన్ని నేర్పిందని, వన్ హెల్ ఆఫ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని అన్నారు. ఇరువురు రెండు వేర్వేరు ప్రకటనల ద్వారా తమ జర్నీ కి శుభం కార్డు పడ్డట్టుగా తెలిపారు.
ఇద్దరం వేర్వేరు పనుల్లో బిజీగా ఉండడం వల్ల తగినంత సమయం ఈ ప్రాజెక్ట్ కి కేటాయించలేకపోతున్నామని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాం అని అశ్విన్ గంగరాజు తెలిపాడు. ఇన్నాళ్లు మాకు అండగా ఉన్నందుకు కార్తికేయ కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఇక మీదట ఆకాశవాణి సినిమా బాధ్యతలను ఏయూ అండ్ ఐ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ పద్మనాభరెడ్డి నిర్వహించనున్నారు. తన ప్రకటనలో ఆకాశావాణి బాధ్యతలను భుజానికి ఎత్తుకున్న ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాడు అశ్విన్.ఈ కారణాలతో సినిమా ఆలస్యమైన ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తామని తెలిపాడు దర్శకుడు అశ్విన్ గంగరాజు.