సుశాంత్ కేసులో కొత్త ట్విస్ట్: డ్రగ్ మాఫియాతో రియాకు సంబంధాలు..!
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి రోజుకో కేసులో ఇరుక్కుంటుంది. సుశాంత్ విచారణలో భాగంగా రియా చక్రవర్తికి డ్రగ్ డీలర్స్ తో సంబంధాలు ఉన్నాయన్న విషయం బయటపడింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసులో తీగలాగుతుంటే డొంకంతా కదులుతుంది. సీబీఐ విచారణలో దిగ్బ్రాంతి కలిగించే విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న రియా చక్రవర్తి మరిన్ని కేసులలో ఇరుక్కునే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆమె డ్రగ్ మాఫియాతో కూడా సంబంధాలు కలిగి ఉన్నారన్న సంగతి బయటికి రావడం జరిగింది.
సుశాంత్ రాజ్ పుత్ దగ్గర వంటవాడిగా పనిచేసిన నీరజ్ ను సీబీఐ విచారణ చేయగా, సుశాంత్ సింగ్ గంజాయి సేవించే వారని తెలియజేశారు. గంజాయితో కూడిన సిగరెట్లు శామ్యూల్ మిరాండా చుట్టి ఇస్తూ ఉంటే ఆయన తాగేవారని నీరజ్ చెప్పడం జరిగింది. దీనితో డ్రగ్ డీలర్స్ తో సుశాంత్ కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు.
ఈ క్రమంలో రియా చక్రవర్తి కొందరు డ్రగ్ డీలర్స్ తో వాట్స్ అప్ చాట్ చేశారన్న విషయం బయటపడింది. ముంబైలో ప్రైవేట్ పార్టీలలో ఉపయోగించే కొన్ని నిషేధిత డ్రగ్స్ గురించి జయ్ సాహా అనే వ్యక్తితో ఆమె కమ్యూనికేషన్ నడిపారని విచారణలో తేలింది. ఎండిఎం, ఐసీవైఎమ్ఏ, ఎండీఎమ్ఏ వంటి మాదక ద్రవ్యాల గురించి వీరి మధ్య సంభాషణ నడిచింది.
ఇక జయ్ సాహా ఓ డ్రగ్ గురించి, దానిని వాడే విధానంపై రియా చక్రవర్తితో చాట్ చేశారు. జయ్ సాహా సదరు డ్రగ్ నీళ్లలో కానీ, కాపీలో కానీ నాలుగు చుక్కలు వేసుకొని సేవించాలని, 30-40 నిమిషాలలో కిక్ బాగా ఎక్కుతుందని చెప్పారట. దీనితో నార్కోటిక్ డిపార్మెంట్ కూడా రంగంలోకి దిగింది.
రియా చక్రవర్తి బాలీవుడ్ లో డ్రగ్స్ అమ్మేదా లేక ఆమె కూడా డ్రగ్స్ కి బానిసా అనే కోణంలో విచారించనున్నారు. ఒకవేళ ఆమె ప్రమాదకరమైన డ్రగ్స్ తో వ్యాపారం చేస్తుందని తెలిస్తే మరిన్ని చిక్కుల్లో ఇరుక్కోవడం ఖాయం. ఎలా చూసినా రియా చక్రవర్తికి రానున్నదంతా గడ్డుకాలమే అని తెలుస్తుంది.