థియేటర్లో టీ, టిఫిన్స్ అమ్ముకున్న యాంకర్ సుమ.. పాపం ఏంటీ పరిస్థితి ?
తెలుగు టాప్ యాంకర్ సుమ చేసిన పని ఆమె అభిమానులకు షాక్కి గురి చేస్తుంది. నిత్యం వరుస షోలతో బిజీగా ఉన్న యాంకర్ సుమ థియేటర్ లో టీ, టిఫిన్లు అందుకుంది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతుంది.
టాలీవుడ్ బిజీయెస్ట్ యాంకర్ సుమ కనకాల. ఆమె చేతిలో దాదాపు ఐదారు షోస్ ఉంటాయంటే అతిశయోక్తి కాదు. కరోనా టైమ్లోనూ వరుసగా టీవీ షోస్తో దూసుకుపోతుంది. ఎంతో మంది యాంకర్లు ఖాళీగా ఉంటున్నా, సుమ మాత్రంనిత్యం బిజీగానే ఉంటుంది.
సుమ కనకాల రెమ్యూనరేషన్ కూడా టాప్లోనే ఉంటుంది. తెలుగు యాంకర్లతో పోల్చితే హైయ్యెస్ట్ పెయిడ్ యాంకర్ సుమ. ఒక్క షోకి మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు తీసుకుంటారని టాక్. సుమకి ఉన్న టాలెంట్కి, షోని ఆమె తీసుకెళ్లిన తీరుని బట్టి టీవీ షో నిర్వహకులు కూడా ఆమె డిమాండ్ చేసినంత ఇచ్చేందుకు వెనకాడరు.
ఇదిలా ఉంటే తాజాగా సుమ థియేటర్లో టీలు, టిఫిన్లు అమ్ముకుంది. అంతేకాదు రోజు రెండు ప్లాస్క్ లు తెస్తే మరిన్ని డబ్బులు వచ్చేవిగా అంటూ పరేషాన్ అవుతుంది.
అయితే ఇదంతా రియల్ లైఫ్ లో కాదనే విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది. మోస్ట్ క్రేజీయెస్ట్ యాంకర్ టీలు అమ్ముకోవడమేంటనేది డౌట్ వచ్చే ఉంటుంది. నిజమే ఓ టీవీ షోలో సుమ టీ, టిఫన్లు అమ్ముకున్నారు.
సుమకి బాగా పేరుతెచ్చిన ప్రోగ్రామ్లో `క్యాష్` ఒకటి. కొన్నేళ్లుగా ఇది రన్ అవుతుంది. తాజా ఎపిసోడ్లో సీరియల్ నటులు ప్రియాంక నాయుడు, రాజ్, మహేశ్వరి, రాజేష్ పాల్గొని సందడి చేశారు.
ఇందులో భాగంగా థియేటర్ ఎపిసోడ్ వచ్చింది. సినిమా చూసేందుకు వచ్చిన వారంతా థియేటర్కి వచ్చారు. అయితే సుమ మాత్రం టీ అమ్మే మహిళా టీ ప్లాస్క్, టీఫిన్ బాక్స్ పట్టుకుని మరీ వచ్చింది.
దీంతో థియేటర్లో కూర్చొన్న వాళ్లంతా మాకు టీ పోయండి అంటూ డబ్బులు ఇవ్వబోయారు. వెనకాల రాజేష్ మా వదిన టీ అమ్ముకునేదానిలా కనిపిస్తుందా అంటూ ఫైర్ అయ్యాడు.
ఇలా రెండు మూడుసార్లు టీ కోసం ఆడియెన్స్ లా షోలో పాల్గొన్న వారు రావడం, పక్కన వ్యక్తి కామెంట్ చేయడం నవ్వులు పూయించింది. చివరి థియేటర్లోనే టిఫిన్ బాక్స్ తీసి అందరికి టిఫిన్ పంచిపెట్టడం నవ్వులు పూయించింది.
ఈ క్రమంలో సుమ అంటూ దీనికే(టీ) పది రూపాయలు వస్తే, నేను వచ్చేటప్పుడు రెండు ప్లాస్క్ లు తీసుకుని వచ్చేదాన్ని, రెండు వందలో మూడు వందలో సంపాదించుకోవచ్చు అని చెప్పడం మరింతగా ఆకట్టుకుంటుంది.
ఆద్యంతం ఫన్నీగా సాగిన ఈ ఎపిసోడ్ నవ్వులు పూయించింది. అందరిచేత కడుపుబ్బ నవ్వించింది. లేటెస్ట్ ప్రోమోలో హైలైట్గా మారింది. ఈ శనివారం ఈ `క్యాష్` ప్రోగ్రామ్ ప్రసారం కానుంది.