ఉదయ్ పూర్ ఫొటోలు: స్టైలిష్ లుక్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా బన్ని
నిహారిక వివాహం ఈ నెల 9వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ అంతా పెళ్లి పనుల్లో నిమగ్నమైంది. కరోనా కారణంగా కేవలం కుటుంబసభ్యులు, బంధుమిత్రులను మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానించారు. ఈ పెళ్లి కోసం మెగా కుటుంబ సభ్యులు ఉదయ్ పూర్ కు తరలి వెళుతున్నారు. ఇవాళ అల్లు అర్జున్ తన తల్లిదండ్రులతో కలిసి కుటుంబ సమేతంగా చార్టర్డ్ విమానంలో ఉదయ్ పూర్ వెళ్లారు. ఆయన సోదరులు వెంకట్, శిరీష్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఈ ముగ్గురు బ్రదర్స్ హంగామా మామూలుగా లేదు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇంటర్ నెట్ లో వైరల్ అవుతున్నాయి.
మెగాబ్రదర్ నాగబాబు తనయ నిహారికకు, గుంటూరు రేంజి ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహానికి ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ హోటల్ వేదిక అవుతోంది. మరికొద్ది గంటల్లో ఈ జంట ఒకటి కానుంది.
ఇప్పటికే నాగబాబు కుటుంబ సభ్యులు, చైతన్య కుటుంబ సభ్యులు చార్టర్డ్ విమానంలో ఉదయ్ పూర్ కి తరలివెళ్లారు. వారి హంగామా అక్కడ ఆల్రెడీ మొదలైపోయింది
తాజాగా అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులతో పాటు అల్లు అరవింద్ దంపతులు కూడా ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
ట్రెడిషినల్ వేర్లో అల్లు అర్జున్ మెరిసిపోతున్నాడు. ఈయన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలే మీరు ఇక్కడ చూసేది.
నిహారిక పెళ్లి పనులు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు, తన తల్లి పద్మ నిశ్చితార్థ చీరలో నిహారిక పెళ్లి కుమార్తెగా మెరిసిపోయారు.
నిహారికను పెళ్లి కూతురిని చేసిన అనంతరం ఎమోషన్ కి గురయ్యారు మెగాబ్రదర్ నాగబాబు. ఆ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మీడియాకు అందుతూనే ఉన్నాయి.
మెగా బ్రదర్ నాగబాబు ఈ పెళ్లికి సంబంధించిన చిన్న వీడియోను తన ఇన్స్టా ద్వారా షేర్ చేశాడు. అందులో దాదాపు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్లికి హాజరయ్యారు.
ఇందులో మెగా బ్రదర్స్ చిరు, నాగబాబు పక్కపక్కన మనకు కనిపిస్తారు. కేవలం మెగా ఫ్యామిలీనే కాకుండా అల్లువారి కుటుంబం కూడా స్పెషల్ ఫ్లైటర్ల ద్వారా ఉదయ్ పూర్కు వెళ్లారు.
నిహారికా, చైతన్యల వివాహ వేడుక రేపు జరుగనుంది. ఇందులో టాలీవుడ్ తారాగణం మొత్తం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.
మెగా డాటర్ వివాహాన్ని ఉదయ్ పూర్లో ఓ పండుగలా జరుపుతున్నారు. ఈ పోస్ట్కు నాగబాబు స్నీక్ పీక్.. తరువాత వచ్చే దాన్ని చూడాలి అంటూ రాసుకొచ్చాడు.
ఇక సినీ, రాజకీయ ప్రముఖులు అదేవిధంగా సన్నిహిత వర్గాల కోసం హైదరాబాద్లో స్పెషల్గా రిసెప్షన్ ఏర్పాటు చేసింది మెగా ఫ్యామిలీ.
మెగాస్టార్ చిరంజీవి పెళ్లికానుకగా నిహారికకు ఖరీదైన డైమండ్ నెక్లెస్ రెడీ చేశారట. దాని విలువ సుమారు రూ.కోటిన్నర అట. అలాగే చైతన్యకు కూడా అదిరిపోయే గిఫ్ట్ రెడీ చేశారట.
రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఈ జంట ఒక్కటికానుంది. ఈ వేడుకకు రాజస్థాన్లోని ఉదయ్పూర్లోని ఉదయ్ విలాస్ వేదికైంది.
వధూవరులు, వారి తల్లిదండ్రులు, వరుణ్ తేజ్, కల్యాణ్ దేవ్, శ్రీజ, సుస్మిత తదితరులతో పాటు కొణిదెల, అల్లువారి ఫ్యామీలీస్ అక్కడకి వెళ్లాయి.
కొణిదెల వారింట మొదలైన పెళ్లి సందడి గురించే ఇప్పుడు అంతటా చర్చ. మెగా ఇంట పెళ్లి వేడుక అంటే ఓ రేంజ్లో ఉంటదనే విషయం తెలిసిందే.
కొణిదెల వారింట మొదలైన పెళ్లి సందడి గురించే ఇప్పుడు అంతటా చర్చ. మెగా ఇంట పెళ్లి వేడుక అంటే ఓ రేంజ్లో ఉంటదనే విషయం తెలిసిందే.
వేడుక సందర్భంలో మరోసారి తన అన్న చిరంజీవిపై ఉన్న ఆప్యాయతను, అనురాగాన్ని మరోసారి బయటపెట్టారు నాగబాబు.
తన కుమార్తెతో కలిసి అన్నయ్య దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ కామెంట్ చేశారు. అతని ప్రేమకు అవధుల్లేవు, అతని చిరునవ్వు ప్రతి సందర్భాన్ని ఒక వేడుకగా మార్చుతుందంటూ నాగబాబు అన్నయ్య మీద ఉన్న ప్రేమను మరోసారి వెల్లడించారు.
అసలు ప్రీవెడ్డింగ్ వేడుకలోనే జోష్ ను అంబరాన్నంటించారు. ఇక పెళ్లి వేడుకలో మెగా సందడి మామూలుగా ఉండదేమో అన్నంతగా రచ్చ చేసారు.
ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. మెగా ఇంట జరిగిన ఈ వేడుకల్లో నిహారిక, చైతన్యలతో పాటు చిరంజీవి కుమార్తెలు సుస్మిత, శ్రీజ, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, చిరంజీవి మేనల్లుడు సాయితేజ్, అల్లుడు కల్యాణ్ దేవ్, అల్లు వెంకట్, శిరీష్ తదితరులు హాజరయ్యారు.
బన్నీ అర్ధాంగి అల్లు స్నేహ కూడా ఈ వేడుకల్లో తళుక్కుమని ఈ వేడుకకు నిండుతనం తెచ్చారు. ఇప్పుడు ఆ ఫొటోలన్నీ సోషల్ మీడియా అంతటా దర్శనమిస్తున్నాయి.
పెళ్లి నేపథ్యంలో నిహారిక కొత్త ప్రాజెక్టులను అంగీకరించలేదు. మరోవైపు కరోనా నేపథ్యంలో గత ఆరు నెలల నుంచి ఇంటిపట్టునే ఉండటం వల్ల ఆమె కొంచెం బరువు పెరిగింది
దీంతో, బరువు తగ్గేందుకు ఆమె రెగ్యులర్ గా జిమ్ కు వెళ్లింది. తన కాబోయే భర్త చైతన్యతో కలిసి ఆమె జిమ్ కు వచ్చింది. జిమ్ వెలుపల తీసిన వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి