బ్లూ కలర్ ట్రెండీ వేర్లో మత్తెక్కిస్తున్న ఐశ్వర్యా రాజేష్.. చూపులతోనే చంపేస్తుందిగా!
ఐశ్వర్యా రాజేష్ ట్రెండ్ వేర్లో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మత్తెక్కించే చూపులతో పరువాలు పోతూ నేను చాలా హాట్ గురూ అని నిరూపిస్తుంది. చూపులతోనే చంపేస్తుందీ డస్కీ అందాల భామ. లేటెస్ట్ పిక్స్ హల్చల్ చేస్తున్నాయి.
డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్ నటనకు ప్రయారిటీ ఉన్న సినిమాల్లో నటిస్తూ హీరోయిన్గా దూసుకుపోతుంది. గ్లామర్ విషయంలో ఎన్నో బారియర్స్ పెట్టుకున్న ఈ భామ అడపాదడపా ట్రెండీ వేర్లో హోయలు పోతూ షాక్కి గురి చేస్తుంది.
తాజాగా పంచుకున్న గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనలోని కొత్త యాంగిల్స్ చూపిస్తూ ఐశ్వర్యా మేకర్స్ కి, తన అభిమానులకు షాక్ ఇస్తూ సర్ప్రైజ్ చేస్తుంది. తమిళంలో ఓ టీవీ షోలో పాల్గొనేందుకు ఇలా కలర్ఫుల్గా అందంగా ముస్తాబై హోయలు పోయింది ఐశ్వర్యా.
తెలుగు ఫ్యామిలీకి చెందిన ఈ తమిళ సోయగం తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అందాల ఆరబోతకి అతీతంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకుంది. తనదైన నటనతో బలమైన పాత్రలను రక్తికట్టిస్తూ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది ఐశ్వర్యా రాజేష్.
చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన ఐశ్వర్య రాజేష్ 2010లో `నీతన అవన్` చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ కెరీర్ని బిల్డ్ చేసుకున్న ఐశ్వర్య విజయ్ సేతుపతితో చేసిన `రమ్మీ`, `పన్నైయరుమ్ పద్మియుమ్` చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది.
విభిన్న కథా చిత్రాలు, బలమైన పాత్ర కలిగిన సినిమాలు చేస్తూ నటిగా తానేంటో నిరూపించుకుంది. స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
`కౌసల్య కృష్ణమూర్తి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. గతేడాది `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రంలోనూ విజయ్ దేవరకొండతో కలిసి నటించి మంచి మార్కులు కొట్టేసింది.
ఇప్పుడు నానితో `టక్ జగదీష్` చిత్రంలో నటిస్తుంది. `రిపబ్లిక్`, `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్లో రానా సరసన నటిస్తూ బిజీగా ఉంది. ఇలా తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది ఐశ్వర్య.