కారడవిలో క్రూరమృగాల మధ్య డేంజరస్ ఫోటో షూట్ చేసిన మహేష్ హీరోయిన్ కృతి సనన్!
పుర్రెకో బుద్ది జివ్హాకో రుచి... ఒక్కొక్కరి అభిరుచి ఒకలా ఉంటుంది. ప్రపంచంలో ఈ ఇద్దరు ఒకలా ఆలోచించరట. బాలీవుడ్ భామ కృతి సనన్ తీరు చూస్తుంటే ఇవన్నీ నిజమే అనిపిస్తుంది. ఫోటో షూట్ అంటే ఎవరైనా అందమైన ప్రదేశాలు ఎంచుకుంటారు. ఈమె మాత్రం భయంకరమైన కారడవి ఎంచుకుంది.
బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది కృతి సనన్. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ వెండితెర ఎంట్రీ టాలీవుడ్ ద్వారానే జరిగింది. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ వన్ నేనొక్కడినే చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించారు.
ఆ సినిమా టేకింగ్ పరంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ గా పెద్ద విజయం సాధించలేదు. ఇక నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన దోచేయ్ మూవీలో కృతి నటించడం జరిగింది. ఈ రెండు చిత్రాల అనంతరం కృతి టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు.
దాదాపు ఆరేళ్ళ తరువాత ప్రభాస్ చిత్రం ద్వారా మరలా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది కృతి సనన్. ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీలో సీత పాత్రకు కృతిని తీసుకోవడం జరిగింది. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా చేస్తున్న విషయం తెలిసిందే.
ఆదిపురుష్ మూవీతో కలిపి దాదాపు ఐదు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న బచ్చన్ పాండే వంటి క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా కృతి హీరోయిన్ గా నటిండం విశేషం.
కాగా కృతి సనన్ ఓ ప్రమాదకరమైన ఫోటో షూట్ చేశారు. భయంకరమైన అడవిలో క్రూర మృగాల మధ్య క్రేజీ ఫోజులిచ్చారు. సింహాలు, జిరాఫీలకు దగ్గరగా నిల్చొని కృతి సనన్ చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ గా మారింది.
ఏదైనా తేడా వస్తే జంతువుల బారిన పడే ప్రమాదం ఉండగా ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడం కోసం భారీ రిస్క్ చేసినట్లు అనిపిస్తుంది. కృతి సనన్ లేటెస్ట్ ఫొటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.