ఘనంగా కత్రినా పెళ్లి.. హాజరైన సినీ ప్రముఖులు!
కత్రినా ఓ నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అదే నగల దుకాణానికి తెలుగులో నాగార్జున, తమిళంలో ప్రభు, కన్నడలో శివరాజ్ కుమార్ కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ వివాహం అంగరంగవైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సినిమా ఇండస్ట్రీకి చెందిన అగ్ర తారలు హాజరయ్యారు. అదేంటి.. కత్రినాకి వివాహం ఎప్పుడు జరిగిందని అనుకుంటున్నారా..?పెళ్లైతే జరిగింది కానీ అది నిజమైన వివాహం కాదు.
కత్రినా ఓ నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అదే నగల దుకాణానికి తెలుగులో నాగార్జున, తమిళంలో ప్రభు, కన్నడలో శివరాజ్ కుమార్ కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
వీరందరితో పాటు బాలీవుడ్ నటుడు అమితాబ్ ఆయన సతీమణి జయాబచ్చన్ లు సైతం బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. తాజాగా ఈ నగల దుకాణం కోసం కొత్త యాడ్ ని షూట్ చేశారు.
ఇందులో కత్రినా కైఫ్ కి వివాహం చేస్తున్నట్లు చూపించారు. కత్రినా తల్లితండ్రులుగా అమితాబ్, జయా బచ్చన్ నటించగా.. పెళ్లికి వచ్చిన ముఖ్య అతిథులుగా నాగార్జున, ప్రభు, శివరాజ్ కుమార్ లు కనిపించారు.
ఈ యాడ్ కి సంబంధించిన పలు ఫోటోలను అమితాబ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. పలు చిత్రపరిశ్రమలకు చెందిన నటులతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున.. తమిళ పరిశ్రమకు చెందిన శివాజీ గణేషన్ కుమారుడు ప్రభు.. కన్నడం నుంచి రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్లతో ఈ యాడ్లో కలిసి నటించాడు అమితాబ్ బచ్చన్.
వారందరితో కలిసి నటించడం జయాబచ్చన్ కి ఎంతో ఆనందాన్నిచ్చిందని అమితాబ్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.