ఇన్నాళ్లూ బయటకు రాని శ్రియ సెక్సీ ఫొటోలు
కొంతమందికి వయస్సుతో పాటే అందం పెరుగుతూంటుంది. అలాగే వయస్సులో ఉన్నప్పటి అందం మళ్లీ వచ్చేస్తూంటుంది. కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చినా నేను మళ్లీ వచ్చేసా అని వయస్సు ఊపేస్తుంటుంది. శ్రియ పరిస్దితి అదే. వయసు మీదపడినా... వన్నె తరగని అందాల భామల లిస్ట్ ని తయారు చేస్తే అందులో శ్రియ శరణ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.2001లో ఇష్టం సినిమాతో పరిచయమైన ఈ అందం...సౌత్ జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చేసి..ఇరవై ఏళ్లు అవుతున్నా..ఆ కిక్ దిగటం లేదు. దానికితోడు ఇదిగో ఇలా ఆమె వెలిగిపోతున్నప్పటి సెక్సీ ఫొటోలను వెలుగులోకి తీసుకువచ్చి రచ్చ రచ్చ చేస్తోంది. ఈ 35 ఏళ్ళ అందం ఎన్ని పాత్రలు చేసినా, తన అమాయికు మొహం, మోహం కనపించే కళ్లు,కళ్లు తిప్పుకోని అందం తో అలా స్క్రీన్ పై మ్యాజిక్ చేసేసేది. పెళ్లి చేసుకుంది..ఇంక సైలెంట్ అయ్యిపోతుందేమో అనుకుంటే ..నాకు లైసెన్స్ వచ్చిందన్నట్లు అందాల ప్రదర్శనలో పీహెచ్ డీ చేసే పోగ్రమ్ కు తెర తీసింది. ఆమె అలనాటి అందాల ఫొటోలపై ఓ లుక్కేద్దాం.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అందాల భామ శ్రియ, తన పాత ఫొటోలతో అభిమానులకు కనువిందు చేసింది. ఇప్పుడివి మీడియా వర్గాల్లో హాట్ ప్రాపర్టీగా మారాయి.
ఆమె తన క్రేజ్ ని అలాగే ఉంచుకునేందుకు పార్టీ, పర్సనల్ అనే తేడా లేకుండా వీడియోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్లలో పోస్ట్ చేసి,అభిమానులకు విందు చేస్తూంటుంది.
సోషల్ మీడియాలో సెక్సీ డ్రస్ లలో శ్రియ అందాలు అభిమానులకు మత్తెక్కిస్తున్నాయి. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వీటికి లక్షలకు పైగా లైక్స్ రావటం విశేషం. అంతేకాదు కుప్పలు తెప్పలుగా పైగా కామెంట్స్ వచ్చి పడ్డాయి.
‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రియ తరువాత స్టార్ హీరోయిన్గా ఎదిగింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్బాబు, ప్రభాస్, రవితేజ.. ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
ఆమె వయసు 35 యేళ్లు పైగానే కానీ నవతరం భామలకి దీటైన అందంతో తెరపై మెరుస్తుంటుంది. ఆఫర్స్ అందుకోవడంలోనూ ఆమె జోరును ప్రదర్శిస్తోంది.
అయితే యంగ్ జనరేషన్ ఎంట్రీతో శ్రియకు అవకాశాలు తగ్గిన మాట నిజం. అయితే తన స్ట్రాటజీ మార్చింది. ఇప్పటికీ సీనియర్ హీరోల సరసన నటిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ.
ఓ ప్రక్కన సినిమాల్లోనూ నటిస్తూనే పర్శనల్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. దాంతో మరింత గ్లామర్ ఆమెకు యాడ్ అవుతోంది.
ఆ మధ్యన రష్యన్ మ్యూజీషియన్ ఆండ్ర్యూని వివాహం చేసుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ఆండ్రూతో కలిసి మ్యూజిక్ షోస్లో పాల్గొంటుంది శ్రియ.
ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘ఇష్టం’తో తెలుగు తెరకు పరిచయమైందీ భామ. తొలి చిత్రంతోనే తన అందంతో కుర్రకారు మనసు దోచుకొంది. దాంతో వెంటనే ఆఫర్స్ వరుస కట్టాయి.
‘సంతోషం’ చిత్రంలో నాగార్జున సరసన నటించి విజయాన్ని సొంతం చేసుకొంది. ఇక అక్కడ్నుంచి ఆమె జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది.
తెలుగుతో పాటు, మిగతా దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి పేరు తెచ్చుకొంది. హిందీ, ఇంగ్లిష్ చిత్రాల్లోనూ మెరిసింది.
డెహ్రాడూన్లో సెప్టెంబరు 11, 1982లో పుట్టిన శ్రియ, హరిద్వార్లో పెరిగింది. ఈమె పూర్తి పేరు శ్రియశరణ్ భట్నాగర్. దిల్లీలోని లేడీ శ్రీరమ్ కాలేజ్లో డిగ్రీ చదువుకుంది.
చిన్నప్పట్నుంచే డ్యాన్స్పై పట్టు పెంచుకొన్న శ్రియ కథక్, రాజస్థాన్ ఫోక్ డ్యాన్స్ నేర్చుకుంది. అదే ఆమెకు బాగా ప్లస్ అయ్యింది.
కాలేజీలో చదువుతున్నప్పుడే డ్యాన్స్ మాస్టర్ ప్రోత్సాహంతో ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించే అవకాశం లభించింది. ఆ వీడియోనే ఆమెకి సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది.
2003లో ‘తుఝే మేరీ కసమ్’ చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం కూడా శ్రియకి మంచి పేరు తీసుకొచ్చింది. తెలుగులో ‘నువ్వే నువ్వే’తో పాటు, ‘ఠాగూర్’, ‘నీ మనసు నాకు తెలుసు’, ‘నేనున్నాను’, ‘అర్జున్’, ‘బాలు ఏబీసీడీఈఎఫ్జి’, ‘నా అల్లుడు’, ‘సదా మీ సేవలో’, ‘సోగ్గాడు’, ‘సుభాష్ చంద్రబోస్’, ‘మొగుడు పెళ్లాం ఓ దొంగోడు’, ‘ఛత్రపతి’, ‘భగీరథ’ ఇలా జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంది శ్రియ.