పవన్ రాజకీయాలతో బిజీ.. ఆ టైంలో తమ్ముడికి భోజనం పంపింది వాళ్లిద్దరే: చిరంజీవి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది పవన్ కి రీఎంట్రీ చిత్రం. అదే విధంగా పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శత్వంలో కూడా ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది పవన్ కి రీఎంట్రీ చిత్రం. అదే విధంగా పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శత్వంలో కూడా ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు కాకుండా పవన్ హరీష్ శంకర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఆర్థిక అవసరాల కోసం తాను తిరిగి సినిమాల్లో నటిస్తున్నట్లు పవన్ ఇదివరకే ప్రకటించారు. రానున్న నాలుగేళ్లలో వీలైనన్ని ఎక్కువ చిత్రాల్లో నటించేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.
ఇక పవన్ కళ్యాణ్.. తన సోదరుడు చిరంజీవి మధ్య బంధం రాజకీయాలకు అతీతమైనది. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తీరిక సమయం దొరకడంతో చిరు మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు.
ఇటీవల ఇంటర్వ్యూలో భాగంగా చిరు తన భార్య సురేఖ గురించి, పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖలు తనకు తల్లి దండ్రులతో సమానం అని పేర్కొన సంగతి తెలిసిందే.
ఇక చిరంజీవి ఇంటర్వ్యూలో చెబుతూ.. పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా ఏపీలో పర్యటించేవాడు. పర్యటనలు ముంగించికుని వారానికో, 10 రోజులకో హైదరాబాద్ వచ్చేవాడు. పవన్ పర్యటనలు ముగించుకుని హైదరాబాద్ వస్తే.. మా అమ్మ అంజనా దేవి గారు, నా భార్య సురేఖ పవన్ కు ఇష్టమైన వంటకాలతో భోజనం పంపేవారు చిరు తెలిపారు.
పవన్ కళ్యాణ్ తన వదిన సురేఖపై అపారమైన గౌరవంతో ఉంటాడు. చిన్నతనంలో తాను తన అక్కలు, వదిన వద్దే పెరిగినట్లు పవన్ పలు సందర్భాల్లో తెలిపాడు.
ఇక లూసిఫెర్ రీమేక్ విషయంలో కూడా చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కు లూసిఫెర్ చిత్రం ఇష్టమైతే తాను వదులుకోవడానికి సిద్ధం అని చిరు తమ్ముడిపై ప్రేమ చూపించారు.