MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • భారత్ నుంచి బ్రిటీషర్లు దోపిడీ చేసిన సంపద విలువ 328,000 లక్షల కోట్లు..రాయడానికి సున్నాలు సరిపోవేమో..

భారత్ నుంచి బ్రిటీషర్లు దోపిడీ చేసిన సంపద విలువ 328,000 లక్షల కోట్లు..రాయడానికి సున్నాలు సరిపోవేమో..

భారతదేశం సువర్ణ భూమి అని ప్రతి ఒక్కరూ పేర్కొంటారు ఇక్కడి సంపద ప్రపంచంలో మరే దేశంతోను పోటీ పడలేనంతగా ఉందని  చరిత్రకారులు చెబుతున్నారు.  ఈ సంపద కారణంగానే మన దేశం  విదేశీ దండయాత్రల చేతుల్లో ఆక్రమణలకు గురైంది.  ముఖ్యంగా భారతదేశాన్ని బ్రిటీషర్లు దోచుకున్నంతగా మరే ఇతర విదేశీయులు దోచుకోలేదని చరిత్ర మనకు చెబుతోంది. 

3 Min read
Author : Krishna Adhitya
Published : Aug 14 2023, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మధ్యయుగం నాటి విదేశీ  దండయాత్రలో భారత దేశంలోని బంగారం రత్నాలు వజ్రాలు వంటి విలువైన ఆభరణాలు ఇతర విలువైన వస్తువులను మాత్రమే దోచుకెళ్లేవారు. కానీ బ్రిటీషర్లు మాత్రం భారతదేశంలోని సంపదను గుర్తించి దాదాపు మూడు శతాబ్దాల పాటు ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక బద్ధంగా ఈ దేశ సంపదను దోచుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1757లో తొలిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశంలోని  బెంగాల్ లో తొలిసారి  తన సామ్రాజ్యాన్ని స్థాపించి పన్నుల వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకుంది.  అలా ఒక వ్యవస్థీకృత దోపిడీ వ్యవస్థను ఏర్పాటు చేసి, మన దేశంలోని ప్రజల నుంచి పన్నుల రూపంలోనూ సంపదను  దోచుకుందని  చరిత్రకారులు చెబుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
If we spend more than we earn, we are ahead

If we spend more than we earn, we are ahead

2019లో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్  ఒకానొక సందర్భంలో బ్రిటిష్ వలస పాలకుల చేతిలో భారతదేశం ఎంత నష్టపోయిందో లెక్కలతో సహా పేర్కొన్నారు నేటి విలువతో అది పోల్చి చూసినట్లయితే దాదాపు 45 ట్రిలియన్ డాలర్లతో సమానమని ఆయన పేర్కొన్నారు నేడు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ  పరిమాణం 3.7 ట్రిలియన్ డాలర్లు దీన్నిబట్టి భారతదేశాన్ని బ్రిటిషర్లు ఏ స్థాయిలో దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చు.  ప్రస్తుతం ఈ మొత్తం నేటి రూపాయి విలువతో పోల్చి చూస్తే 328,000 లక్షల కోట్లుగా తేలింది. 
 

38

ముఖ్యంగా 1857 నుంచి భారత దేశంలో పూర్తి స్థాయిలో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడింది.  అంతకు ముందు ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానంలో నేరుగా బ్రిటన్ రాణి  పరిపాలన సాగించింది.  దాదాపు భారత  ఉపఖండం మొత్తం  బ్రిటన్ సామ్రాజ్యంలో భాగం అయింది.  దీంతో దేశమంతా వ్యవస్థీకృత పన్నుల చట్టాలను అమలు చేసి బ్రిటిషర్లు పన్నులను వసూలు చేసినట్లు తెలుస్తోంది.  బ్రిటన్ సామ్రాజ్యంలోని ఇతర వలస దేశాలతో పోల్చి చూసినట్లయితే భారతదేశ వాటా సింహభాగం ఉండేది. 
 

48

బ్రిటన్ సాధించిన పారిశ్రామిక విప్లవం వెనుక భారతదేశము వెన్నెముకగా నిలిచింది.  బ్రిటన్ లోని పరిశ్రమలు అన్నింటికీ భారత్ నుంచి ముడి సరుకు అందేది.  ముడి సరుకు అందిన తర్వాత వచ్చిన ఉత్పత్తులను ప్రపంచ దేశాల్లో బ్రిటన్ విక్రయించేది.  అలా బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భారత్ నుంచి లాభం పొందింది
 

58

బ్రిటన్ భారతదేశాన్ని సుమారు 200 సంవత్సరాలు పరిపాలించింది. ఈ 2 శతాబ్దాల్లో భారత దేశం తీవ్రమైన పేదరికం, కరువుతో అల్లాడిపోయింది. ఈ రెండు శతాబ్దాల్లో భారతదేశ సంపద క్షీణించింది. భారత్ , బ్రిటన్ మధ్య ఆర్థిక సంబంధాలపై పరిశోధన చేసిన ప్రఖ్యాత ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ ఇటీవల కొన్ని సంచలన నిజాలు బయటపెట్టారు. బ్రిటిష్ వారు భారతదేశం నుంచి కేవలం కోహినూర్ మాత్రమే కాదు. అంతకన్నా విలువైన భారత ఆర్థిక వ్యవస్థను దోపిడీ చేశారు. ఇటీవల కొలంబియా యూనివర్శిటీ ప్రెస్‌లో ప్రచురించిన తన వ్యాసంలో పట్నాయక్, భారతదేశం నుండి బ్రిటన్ 45 ట్రిలియన్లకు పైగా నిధులను దోపిడీ చేసిందని పేర్కొన్నారు. ఫలితంగా మన దేశం నేటికీ పేదరికం నుండి బయటపడే  సామర్థ్యాన్ని అడ్డుకుంటోందని పేర్కొన్నారు. 
 

68

బ్రిటన్ 70 ఏళ్ల క్రితం భారత్‌ను విడిచిపెట్టినప్పటికీ వలసపాలన మచ్చలు అలాగే ఉన్నాయని పట్నాయక్ అన్నారు. "1765 - 1938 మధ్యకాలంలో 45 ట్రిలియన్లు డాలర్ల విలువైన ఎగుమతులను బ్రిటన్ పొందినట్లు ఆమె పేర్కొన్నారు. ఎగుమతుల్లో మిగులు ఆదాయాలను కొలమానంగా తీసుకొని, దానికి 5 శాతం వడ్డీ రేటు కలిపడం వల్ల ఈ లెక్క తేలినట్లు ఆమె పేర్కొన్నారు. 
 

78

బ్రిటన్ 70 ఏళ్ల క్రితం భారత్‌ను విడిచిపెట్టినప్పటికీ వలసపాలన మచ్చలు అలాగే ఉన్నాయని పట్నాయక్ అన్నారు. "1765 - 1938 మధ్యకాలంలో 45 ట్రిలియన్లు డాలర్ల విలువైన ఎగుమతులను బ్రిటన్ పొందినట్లు ఆమె పేర్కొన్నారు. ఎగుమతుల్లో మిగులు ఆదాయాలను కొలమానంగా తీసుకొని, దానికి 5 శాతం వడ్డీ రేటు కలిపడం వల్ల ఈ లెక్క తేలినట్లు ఆమె పేర్కొన్నారు. 
 

88

భారతీయులకు బంగారం, ఫారెక్స్ సంపాదన వంటి విలువైన వనరులకు తగిన క్రెడిట్ ఎప్పుడూ ఇవ్వలేదని, ఇవన్నీ బ్రిటీష్ దేశంలోని ప్రజలకు ఆహారం ఇవ్వడానికి వెళ్లాయని ఆమె అన్నారు. ఉత్సా పరిశోధన ప్రకారం, 1900 నుండి 1945-46 మధ్య కాలంలో దేశ తలసరి ఆదాయం రూ. 196.1 కాగా, 1945-46లో భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ఒక సంవత్సరం ముందు ఇది కేవలం రూ. 201.9 గా ఉందని పేర్కొన్నారు. ఈ కాలంలో తలసరి ఆదాయం 1930-32లో గరిష్టంగా రూ.223.8కి పెరిగింది. 1929కి ముందు మూడు దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అత్యధిక ఎగుమతి మిగులు ఆదాయాలను ఆర్జించిన దేశాల్లో భారతదేశం రెండవ స్థానంలో ఉన్నప్పుడు కూడా దేశ ప్రజల తలసరి ఆదాయం ఇంత కనిష్ట స్థాయిలో ఉందని ఆమె పేర్కొన్నారు. 
 

About the Author

KA
Krishna Adhitya

Latest Videos
Recommended Stories
Recommended image1
Post Office: రోజుకు రూ. 400 ప‌క్క‌న‌పెడితే చాలు.. వ‌డ్డీ రూపంలోనే రూ. 6 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు
Recommended image2
Gold Price Crash: రాఖీ పండుగ వేళ మహిళలకు గుడ్ న్యూస్...భారీగా కుప్పకూలిపోయిన పసిడి, వెండి
Recommended image3
Business Idea : అరటి పండు, ఆకులతోనే కాదు... అరటి కాండంతోనూ సూపర్ బిజినెస్, లక్షల లాభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved