వంటలు వండి వడ్డిస్తూ కిచెన్ లో ఎమ్మెల్యే రోజా... వీడియో వైరల్
ఆ సమయాన్ని తన కుటుంబసభ్యుల కోసం వండిపెట్టడానికి ఆమె కేటాయించారు. చికెన్ లెగ్ పీస్ ఫ్రై, బీట్ రూట్ చట్నీ, ఫిష్ ఫ్రై, గుత్తివంకాయ కూరలతో ఇంట్లో ఘుమఘుమ లాడిస్తున్నారు.. భర్త సెల్వమణి తోపాటు పిల్లలకు రకరకాల వంటల రుచి చూపిస్తున్నారు..
నిత్యం రాజకీయాలు, జబర్దస్త్ షోలతో బిజీ బిజీగా ఉండే ఎమ్మెల్యే రోజాకి లాక్ డౌన్ పుణ్యమా్ని.. కుటుంబంతో గడిపే సమయం దొరికింది. మామూలుగా అయితే.. రాజకీయాల్లో ఉండేవారికి కుటుంబంతో గడిపే సమయం దొరకదు.
ఇదే విషాయన్ని ఓ టీవీలోని కార్యక్రమంలో చెప్పి.. రోజా కన్నీరు పెట్టుకున్న సందర్భం కూడా ఉంది. తాను తన పిల్లలను బాగా మిస్సౌతున్నానంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
అయితే... కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో.. బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇక టీవీ షోల షూటింగ్ లు కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ఇంట్లో గడపానికి సమయం లభించింది.
ఆ సమయాన్ని తన కుటుంబసభ్యుల కోసం వండిపెట్టడానికి ఆమె కేటాయించారు. చికెన్ లెగ్ పీస్ ఫ్రై, బీట్ రూట్ చట్నీ, ఫిష్ ఫ్రై, గుత్తివంకాయ కూరలతో ఇంట్లో ఘుమఘుమ లాడిస్తున్నారు.. భర్త సెల్వమణి తోపాటు పిల్లలకు రకరకాల వంటల రుచి చూపిస్తున్నారు..
అలాగే తాను చేసిన వంటలని ఇటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, మెడికల్ సిబ్బందికి స్వయంగా వడ్డిస్తున్నారు..నిత్యం అయిదువందల మందికి ఆమె స్వయంగా కూరలు వండుతున్నారు.
కరోనా వైరస్ ని అరికట్టేందుకు వైద్యులు, పారిశుధ్య కార్మికులు కూడా ప్రజల కోసం కంటి మీద కునుకు లేకుండా కష్టపడుతున్న వీరికోసం తన వంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు రోజా.
డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికుల కోసం మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించారు. రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు.
ఇందుకోసం తానే స్వయంగా కూరగాయలు కోసి, వంట చేశారు. అనంతరం ఆమే.. స్వయంగా భోజనం వడ్డించారు. కాగా... ఆమె వంటలకు సంబంధించిన వీడియోలు ఇప్పడు నెట్టింట వైరల్ గా మారాయి.