Avatar 2:అఫీషియల్ గా ‘అవతార్2’రిలీజ్ డేట్ ప్రకటన
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం.. ప్రస్తుతం తుది దశ లో మెరుగులు దిద్దుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత రాబోతున్న అవతార్ హీరో జేక్ ఈసారి తన భార్యా పిల్లలతో సహా సకుటుంబ సపరివార సమేతంగా థ్రిల్ చేయబోతున్నాడు.
‘అవతార్’ సినిమాతో ప్రేక్షకుల్ని పండారా గ్రహంలో ఊరేగించిన జేమ్స్ కామెరూన్.. ఇప్పుడు ‘అవతార్ 2’తో మరోసారి మనల్ని మెస్మరైజ్ చేయటానికి సిద్దపడుతున్నారు. ప్రపంచ సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం.. ప్రస్తుతం తుది దశ లో మెరుగులు దిద్దుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత రాబోతున్న అవతార్ హీరో జేక్ ఈసారి తన భార్యా పిల్లలతో సహా సకుటుంబ సపరివార సమేతంగా థ్రిల్ చేయబోతున్నాడు.
2009లో వచ్చిన వరల్డ్ ప్రీమియర్ అవతార్ సీక్వెల్స్ కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. కొవిడ్ కారణంగా మళ్లీ వాయిదా పడిన అవతార్ 2 2022 డిసెంబర్ 16న రిలీజ్ కాబోతుంది.
ఇప్పుడీ సీక్వెల్తో సముద్ర గర్భంలోని మరో కొత్తలోకాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఆ అందమైన ఊహా లోకాన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. సముద్రంపై అవతార్లు అందంగా నిర్మించుకున్న ఇళ్లు, సంద్రం లోపల వారు పక్షులపై ఈదుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఆ పోస్టర్లలో కనిపించాయి.
ఇక ఈ చిత్రానికి మరో నాలుగు సీక్వెల్స్ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఇందులో భాగంగా ‘అవతార్ 2’ని 2021లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో షూటింగ్ ఆలస్యం అయింది. ఆ మధ్య కేసులు తగ్గి యధా స్దితికి వచ్చాక ఈ సినిమా షూటింగ్ ను తిరిగి న్యూజిలాండ్లో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసినట్టు తాజాగా జేమ్స్ కామెరూన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘అవతార్ 2’ చిత్రీకరణ 100శాతం, ‘అవతార్ 3’ 95 శాతం పూర్తయింది.’’అని చెప్పారు కామెరూన్. 2022 డిసెంబరులో ‘అవతార్ 2’ విడుదల కానుంది.
అవతార్ తర్వాత మొత్తం నాలుగు భాగాలని తెరకెక్కిస్తోన్న మేకర్స్.. ప్రతీ పార్ట్ కి 1900 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే మొత్తం నాలుగు సీక్వెల్స్ కి 11300 కోట్ల బడ్జెట్. ఈ స్థాయిలో సీక్వెల్ సినిమాల కోసం ఖర్చు చేయడం ప్రపంచ సినీ చరిత్రలోనే అరుదైన రికార్డ్.
Also Read : Sankranthi 2022 : అక్క ఇంట్లో బాలయ్య సంక్రాంతి సంబరాలు.. సతీ సమేతంగా కారంచేడుకు..