Asianet News TeluguAsianet News Telugu

క్రేజీ మల్టీ స్టారర్‌.. హీరోలుగా తండ్రీ కొడుకులు

మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు విక్రమ్‌. యంగ్ డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజుతో ఓ సినిమా చేయడానికి ఓకె చెప్పాడు విక్రమ్‌. ఇది విక్రమ్ 60వసినిమా కావటం మరో విశేషం. ప్రస్తుతం విజయ్ హీరోగా మాస్టర్ సినిమాను నిర్మిస్తున్న సెవెన్‌ స్క్రీన్ స్టూడియోస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.

Vikram And Dhruv Will Do a Multi Starrer Movie With Karthik Subbaraj
Author
Hyderabad, First Published Jun 3, 2020, 8:25 PM IST

సౌత్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో విక్రమ్‌. ప్రయోగాత్మక పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ స్టార్ హీరో ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కోబ్రాలో విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు విక్రమ్. ఈ సినిమాతో పాటు మణిరత్నం నిర్మిస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ పొన్నియన్ సెల్వన్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్‌ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు విక్రమ్‌. యంగ్ డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజుతో ఓ సినిమా చేయడానికి ఓకె చెప్పాడు విక్రమ్‌. ఇది విక్రమ్ 60వసినిమా కావటం మరో విశేషం. ప్రస్తుతం విజయ్ హీరోగా మాస్టర్ సినిమాను నిర్మిస్తున్న సెవెన్‌ స్క్రీన్ స్టూడియోస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో విక్రమ్ తో పాటు ఆయన తనయుడు ధృవ్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. టాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన అర్జున్‌ రెడ్డి రీమేక్‌తో ధృవ్‌ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఘనవిజయం సాదించటంతో మంచి క్రేజ్‌ వచ్చింది. తాజాగా తండ్రితో కలిసి నటిస్తుండటంతో ఆ మూవీపై మరింత క్రేజ్‌ ఏర్పడింది. అంతేకాదు ఈ సినిమాలో విక్రమ్‌తో పాటు ధృవ్‌ పాత్రకు కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుందట. తండ్రి కొడుకుల ఇద్దరు పోటా పోటి పాత్రల్లో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ హైప్‌ క్రియేట్ అవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios