‘ఉప్పెన’ :విజయ్ సేతుపతి షాకింగ్ డెసిషన్,హీరోకు దెబ్బ
సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాని తెలుగు,తమిళంలో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ విజయ్ సేతుపతి ఈ సినిమాని తానే స్వయంగా తమిళంలో రీమేక్ చేయాలని అనుకుంటునట్లు సమాచారం.
ఒక భాషలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలోకి రీమేక్ చేయటంలో వింతేమీ లేదు. అయితే మన తెలుగు నుంచి ఎప్పుడో కానీ ఇతర భాషల్లోకి రీమేక్ కావు. మన సినిమాలు డైలాగు ఓరియెంటెండ్ కావటం, భారీ బడ్జెట్ లు కావటంతో వాటిని రీమేక్ చేయటానికి సాహసించరు. సాద్యమైతే డబ్బింగ్ చేసి వదులుతూంటారు. అప్పుడప్పుడూ తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలని వేరే భాషల్లో రీమేక్ చేయడానికి నిర్మాతలు పోటీపడుతూంటారు. రీసెంట్ గా తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించిన అల వైకుంఠపురములో చిత్రం తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్నాయి. అయితే అసలు రిలీజ్ కాకుండా మరో భాషలోకి రీమేక్ వెళ్లే అవకాసం ఉందా అంటే ...ఇప్పుడు ఒక సినిమాకు అలాగే జరగబోతోందని సమాచారం. ఆ సినిమా మరేదో కాదు...‘ఉప్పెన’ .
సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాని తెలుగు,తమిళంలో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ విజయ్ సేతుపతి ఈ సినిమాని తానే స్వయంగా తమిళంలో రీమేక్ చేయాలని అనుకుంటునట్లు సమాచారం. ఎందుకంటే అంతలా ఆయనకు సినిమా నచ్చేసిందిట. తమిళంలో తను విలన్ గా మళ్లీ కనపడటం ఎందుకు అని వద్దనుకుని, తమిళ వెర్షన్ రైట్స్ ఎంతవుతుందో అంతా ఇచ్చేసి, తను అక్కడ రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. తెలుగులో దర్శకత్వం వహించిన బుచ్చిబాబు తమిళ రీమేక్ డైరెక్టర్ గా చేస్తాడని అంటున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ రాలేదు. కానీ ఇలా చేస్తే తమిళంలో వేరే హీరో ఉంటాడు. ఇది వైష్ణవ్ తేజ్ కు కెరీర్ ప్రారంభంలో పడుతున్న దెబ్బ.
ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్,ఫస్ట్ లుక్ మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రీలుక్లో మత్స్యకారుడి గెటప్లో మాస్ లుక్తో కనిపించి వైష్ణవ్ సినీ ప్రియులను మెప్పించారు.అలాగే ఫస్ట్ లుక్ లో వైష్ణవ్ మాస్, లవర్బాయ్ లుక్లో కనిపించారు. ఈ సినిమాలో వైష్ణవ్కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే విజయ్ సేతుపతి లుక్ ని వదిలారు. చేతిలో సిగరెట్ పట్టుకొని కుర్చిలో కూర్చున్న విజయ్ సేతుపతి మాస్లుక్ ఫ్యాన్స్ను ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమాపై అంచనాలు పెంచుతోంది. ‘రాయనం' అనే డిఫరెంట్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతోపాటు సుకుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేద్దామనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో ఎప్పుడు రిలీజ్ అనేది చెప్పలేని పరిస్దితి ఉంది. లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది.