Asianet News TeluguAsianet News Telugu

దిశా ఘటనపై వర్మ ఫస్ట్ లుక్ పోస్టర్..!

దాదాపు ఏడాది క్రితం తెలంగాణాలో జరిగిన ఓ రేప్ అండ్ మర్డర్ కేసు సంచలనం రేపింది. నలుగురు యువకులు దిశా అనే అమ్మాయిని అత్యంత దారుణంగా హింసించి చంపేశారు. ఈ ధారుణ ఘటనపై వర్మ మూవీ ప్రకటించగా నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుంది. 
 

varma releasing first look poster of the movie based on disha incident
Author
Hyderabad, First Published Sep 5, 2020, 9:31 AM IST

రామ్ గోపాల్ వర్మ మరో సంచల ప్రాజెక్ట్ కి నాంది పలికారు. తెలంగాణాలో జరిగిన దిశా ఘటన ఆధారంగా తీస్తున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలపై అప్డేట్ ఇచ్చారు. నేడు ఉదయం 11:00 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. అలాగే నవంబర్ 26న ఈ మూవీ విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. నవంబర్ 26, 2019లో దిశా ఘటన జరుగగా, ఏడాది తరువాత అదే రోజున వర్మ దిశా మూవీని విడుదల చేస్తున్నట్లు చెప్పడం విశేషం. 

గత ఏడాది హైదరాబాద్ శివార్లలో నలుగురు యువకులు దిశా అనే అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిపి, ఆ తదుపరి కాల్చి వేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం రేపగా, పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. నలుగురు యువకులను పట్టుకున్న పోలీసులు, తరువాత ఎన్కౌంటర్ చేసి చంపేశారు. 

కాగా ఈ ఘటనపై మూవీ చేస్తానని వర్మ ఎప్పుడో ప్రకటించారు. నలుగురు నిందుతులో ఒకడైన జొల్లు నవీన్ భార్యను వర్మ ప్రత్యేకంగా కలవడం జరిగింది. ఆమెను తన ఆఫీస్ కి పిలిపించుకున్న వర్మ అనేక విషయాలు అడిగి తెలుసుకున్నాడు. కాగా నేడు విడుదల కానున్న ఆ పోస్టర్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios