విశాల్ పెళ్లి వార్తలు... వరలక్ష్మి ఫైర్!
నటుడు విశాల్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి.
నటుడు విశాల్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఈ జంట మాత్రం తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని చెబుతూనే ఉంది.
తాజాగా విశాల్ కి ఓ తెలుగమ్మాయితో పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో మరోసారి వరలక్ష్మి టాపిక్ తెరపైకి వచ్చింది. ఓ పారిశ్రామికవేత్త కుమార్తె అనీషాతో విశాల్ కి త్వరలోనే నిశ్చితార్ధం జరగనుంది. ఈ విషయాన్ని విశాల్ తండ్రి స్వయంగా వెల్లడించాడు. విశాల్ కి పెళ్లి సెట్ అవ్వడంతో..త్వరలోనే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా పెళ్ళికి సిద్ధమవుతుందని, పెళ్లి తరువాత సినిమాలకు దూరమవుతుందని వార్తలు పుట్టించారు.
ఇవి వరలక్ష్మి వరకు వెళ్లడంతో అమ్మడు బాగా ఫైర్ అయింది. ట్విట్టర్ వేదికగా.. ఈ వార్తలను ఖండించింది. ఇంతకుముందు మాదిరిగానే ఈ ఏడాది చివరిలో కూడా కొందరు పనీపాటా లేరని వారు తన పెళ్లి గురించి మాట్లాడడం మొదలుపెట్టారని ఆగహ్రం వ్యక్తం చేసింది.
తాను ఎక్కడకి వెళ్లడం లేదని, సినిమాల్లో నటిస్తూనే అందరి పని పడతానని ఛాలెంజ్ చేసింది. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నది ఎవరో తనకు తెలుసునని బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అంటూ పెళ్లి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది.