Asianet News TeluguAsianet News Telugu

'పుష్ప' గ్యాప్ ... ‘ఉప్పెన’ కు అలా కలిసొచ్చింది

 వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌,ఫస్ట్ లుక్ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. అయితే లాక్ డౌన్ తో సినిమా విడుదలను వాయిదా వేసారు. అయితే త్వరలో థియోటర్స్ తెరిచే అవకాసం ఉందని వార్తలు వస్తున్న నేపధ్యంలో సినిమా ఎడిటింగ్ పూర్తి చేసి, రన్ టైమ్ లాక్ చేసినట్లు సమాచారం. 

Uppena editing done, runtime locked
Author
Hyderabad, First Published Jun 6, 2020, 10:25 AM IST

మెగా మేనల్లుడు సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌,ఫస్ట్ లుక్ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. అయితే లాక్ డౌన్ తో సినిమా విడుదలను వాయిదా వేసారు. అయితే త్వరలో థియోటర్స్ తెరిచే అవకాసం ఉందని వార్తలు వస్తున్న నేపధ్యంలో సినిమా ఎడిటింగ్ పూర్తి చేసి, రన్ టైమ్ లాక్ చేసినట్లు సమాచారం. సుకుమార్ స్వయంగా ఇదంతా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చేసినట్లు సమాచారం. ఫైనల్ గా రన్ టైమ్ రెండు గంటల ముప్పై నిముషాలకు లాక్ చేసినట్లు తెలుస్తోంది.
 
అల్లు అర్జున్ తో సుకుమార్ ప్రారంభించిన పుష్ప సినిమా షూటింగ్ బ్రేక్ వచ్చింది. మళ్లీ మొదలు కావటానికి, పరిస్దితిలు చక్కబడటానికి రెండు,మూడు నెలలు పట్టచ్చు. ఈ లోగా ఆయన తన శిష్యుడు పరిచయ చిత్రానికి సూచనలు, సలహాలు చేస్తున్నారు. ఉప్పెన చిత్రం ఏప్రియల్ 2న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా దెబ్బకు వాయిదా పడింది. ఈలోగా సినిమాని మరోసారి చూసిన సుకుమార్...కొన్ని ఎపిసోడ్స్ మరింత షార్ప్ గా ఉంటే బాగుంటుందని భావించి ఎడిట్ చేసారు.   
 
ఇక ఈ సినిమాపై నిర్మాణ సంస్ద మైత్రీ మూవీస్ వారు బాగా అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు 22 కోట్ల దాకా ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టు తమకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందని, రంగస్దలం సినిమాలా ఆడుతుందని నమ్ముతున్నారు. అందుకునే ఈ చిత్రం నాన్ థియోటర్ రైట్స్ కు మంచి ఆఫర్స్ వస్తున్నా అమ్మలేదని తెలుస్తోంది. అలాగే తమ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమాని అన్ని ఏరియాలు సొంతగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.

 సినిమా కనుక సూపర్ హిట్ అయితే నాన్ థియోటర్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోతాయని నమ్ముతున్నారు.థియోటర్ ఓవర్ ప్లో ..తమని సేఫ్ జోన్ లో పడేస్తుందని వారి ధీమా. అయితే అది పెద్ద రిస్కే అంటోంది ట్రేడ్. ఏమన్నా తేడా కొట్టి అటూ ఇటూ అయితే మొత్తం నష్టపోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ధియోటరో లేక నాన్ థియోటరో ఏదో ఒక రైట్స్ దగ్గర పెట్టుకుని మిగతాది అమ్మితే రిస్క్ తగ్గుతుందని చెప్తున్నారు. అయితే రిస్క్ ఉన్నచోటే కదా లాభాలు ఉండేది. 
 
ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతోపాటు సుకుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios