టాలీవుడ్ డ్రగ్స్ కేసు: నేడు ఈడీ ముందుకు హీరో తనీష్!
నేడు తనీష్ ఈడీ ముందు హాజరయ్యారు. డ్రగ్ డీలర్ కెల్విన్, తనీష్ల మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీలపై అధికారులు విచారించనున్నారు.
టాలీవుడ్ డ్రగ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. ఆగస్టు 30 నుండి వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలను అధికారులు విచారిస్తున్నారు.మొదట పూరీ జగన్నాథ్, చార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా, రవితేజ, ముమైత్ ఖాన్, నవదీప్లను వరుసగా విచారించిన ఈడీ, వారి దగ్గర నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు సమాచారం. 10మంది టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. వారిలో హీరో తనీష్ కూడా ఉన్నారు.
కాగా నేడు తనీష్ ఈడీ ముందు హాజరయ్యారు. డ్రగ్ డీలర్ కెల్విన్, తనీష్ల మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీలపై అధికారులు విచారించనున్నారు. టాలీవుడ్ సెలబ్రేటీలకు డ్రగ్ హబ్గా మారిన ఎఫ్ లాంజ్ పబ్ వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. డ్రగ్స్ కొనుగోలు విషయంలో ఇద్దరి మధ్య జరిగిన వివరాలను ఈడీ తెలుసుకోనుంది. బ్యాంక్ స్టేట్మెంట్స్, డాక్యుమెంట్లతో రావాలని ఈడీ తనీష్ కి అధికారులు సూచించారు.
2017లో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ చేయనున్న ఈడీ. కెల్విన్ తనీష్ కి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి, స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న అధికారులు. డ్రగ్స్ హబ్ గా మారిన ఎఫ్ లాంజ్ పబ్ వివరాలు ఏమన్నా తెలుసా అన్న కోణంలో తనీష్ ని ప్రశ్నించనున్నారు.