Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ డ్రగ్స్ కేసు:  విదేశాలకు డబ్బు తరలింపు, డ్రగ్స్ కొనుగోళ్లపై అధికారుల దృష్టి

పూరి జగన్నాధ్, రవితేజ, నవదీప్, తరుణ్, ఛార్మి, రానా, రకుల్, నందు,మొమైత్ ఖాన్, తనీష్ లతో పాటు రవితేజ డ్రైవర్, ఎఫ్ క్లబ్ ఓవర్ మొత్తం 12మందిని, ఈనెల 31నుండి సెప్టెంబర్ 22వరకు వరుసగా విచారించనున్నారు. విదేశాలకు నిధుల తరలింపుపై వీరిని ఈడీ విచారించనుంది. 

tollywood drugs case enforcement directorate focus speeding up case
Author
Hyderabad, First Published Aug 28, 2021, 11:32 AM IST


టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. దూకుడు పెంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ), కొందరు టాలీవుడ్ ప్రముఖులకు విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు గతంలో ఈడీ అధికారులు డ్రగ్ పెడ్లర్స్ కెల్విన్, కమింగా, విక్టర్ లను అరెస్ట్ చేయడం జరిగింది. వీరి నుండి కీలక సమాచారం సేకరించడంతో పాటు స్టేట్మెంట్ నమోదు చేశారు. 


పూరి జగన్నాధ్, రవితేజ, నవదీప్, తరుణ్, ఛార్మి, రానా, రకుల్, నందు,మొమైత్ ఖాన్, తనీష్ లతో పాటు రవితేజ డ్రైవర్, ఎఫ్ క్లబ్ ఓవర్ మొత్తం 12మందిని, ఈనెల 31నుండి సెప్టెంబర్ 22వరకు వరుసగా విచారించనున్నారు.  విదేశాలకు నిధుల తరలింపుపై వీరిని ఈడీ విచారించనుంది. వీరి విచారణ పూర్తి అయిన అనంతరం మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం కలదు. 

కొందరు సీలెబ్రిటీలు విదేశాలకు భారీగా డబ్బులు చెల్లించి డ్రగ్స్‌ దిగుమతి చేసుకున్నట్లు గతంలోనే సిట్‌ విచారణలో ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం.. ఇంటర్‌పోల్‌ సహయంతో విదేశీ బ్యాంక్‌ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. తాజాగా మరికొంత హవాలా మార్గంలో డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. దీంతో ఈ కేసు దర్యాప్తును మరింత వేగంవంతం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios