టాలీవుడ్ డ్రగ్స్ కేసు: విచారణకు హాజరైన నటుడు నవదీప్..!
నేడు సోమవారం నటుడు నవదీప్ హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ వినియోగం, కొనుగోళ్లు, మనీ లాండరింగ్ వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ సెలెబ్రిటీలపై విచారణ కొనసాగుతుంది. 10మంది టాప్ సెలెబ్రిటీలతో పాటు రాజవితేజ డ్రైవర్, ఎఫ్ క్లబ్ ఓనర్ కి ఈడీ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాధ్, ఛార్మి, రకుల్ ప్రీత్, రానా దగ్గుబాటి, రవితేజ, తనీష్ ఈడీ విచారణకు హాజరయ్యారు.
కాగా నేడు సోమవారం నటుడు నవదీప్ హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎఫ్క్లబ్లో జరిగే పార్టీలకు తరచూ హాజరయ్యే సెలబ్రిటీలెవరు? అక్కడ జరిగే పార్టీల్లో డ్రగ్స్ సరఫరా చేస్తారా? అనే అంశాలపై క్షుణ్ణంగా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎఫ్క్లబ్ మేనేజర్ని సైతం నేడు ఈడీ అధికారులు విచారించనున్నారు.
2017లో వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపింది. టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీల పేర్లు తెరపైకి రావడం అందరినీ షాక్ కి గురిచేసింది. అప్పట్లో దగ్గుబాటి రానా, రకుల్ అధికారులు విచారించిన వారిలో లేరు. అయితే రానా పేరు అనధికారికంగా వినిపించింది. ప్రముఖుల ఒత్తిళ్ల కారణంగా ఈ కేసు మరుగున పడిందని అందరూ భావించారు. తాజాగా గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖులను ఈడీ విచారించడం, సంచలనంగా మారింది.