Asianet News TeluguAsianet News Telugu

విషాదం: నటుడు ఉత్తేజ్ సతీమణి కన్నుమూత.. చిరంజీవిని పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ..

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమని నమ్ముకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటుడు ఉత్తేజ్ రాణిస్తున్నారు. ఆయన సతీమణి పద్మావతి నేడు తుదిశ్వాస విడిచారు.

Tollywood Actor Uttej wife padmavathi no more
Author
Hyderabad, First Published Sep 13, 2021, 10:10 AM IST

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమని నమ్ముకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటుడు ఉత్తేజ్ రాణిస్తున్నారు. ఆయన సతీమణి పద్మావతి నేడు తుదిశ్వాస విడిచారు. పద్మావతి కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. 

దీనితో కుటుంబ సభ్యులు ఆమెకు బసవతారకం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కానీ పరిస్థితి విషమించడంతో పద్మావతి తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. దీనితో ఉత్తేజ్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

ఉత్తేజ్ సతీమణి మరణించారు అని తెలియగానే చిరంజీవి, ప్రకాష్ రాజ్ లాంటి సినీ ప్రముఖులు పరామర్శించడానికి వెళ్లారు. చిరంజీవిని పట్టుకుని ఉత్తేజ్, అతడి కుమార్తె ఇద్దరూ వెక్కి వెక్కి ఏడ్చారు. వారి విషాదం చూసి చిరంజీవి కూడా ఎమోషనల్ అయ్యారు. 

పక్కనే ఉన్న ప్రకాష్ రాజ్ కూడా కంటతడి పెట్టారు. చిరంజీవిని పట్టుకుని అన్నయ్య అన్నయ్య అంటూ ఉత్తేజ్ ఏడుపు ఆపలేదు. ఇక అతడి కుమార్తె అమ్మా అమ్మా అంటూ తల్లడిల్లిపోతోంది. 

ఉత్తేజ్ టాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అందరితో మంచిగా ఉంటూ సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. లాంటి ఉత్తేజ్ సతీమణి మరణించిందనే వార్త ఇండస్ట్రీని కలచివేస్తోంది. ఉత్తేజ్ కు మొదటి నుంచి చిరంజీవి అంటే అభిమానం ఎక్కువ. 

Follow Us:
Download App:
  • android
  • ios