Asianet News TeluguAsianet News Telugu

సుశాంత్ పై రియాకు ప్రేమలేదు, డ్రగ్స్ ద్వారా అతన్ని అదుపులో పెట్టుకుంది- లాయర్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణం రియా చక్రవర్తి అని తీవ్ర ఆరోపణలు రేగుతుండగా, సుశాంత్ తండ్రి కేకే సింగ్ లాయర్ వికాస్ సింగ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. డ్రగ్స్ ద్వారా రియా సుశాంత్ ని అదుపులోపెట్టుకొని ఆర్థిక అవసరాలు తీర్చుకుందని ఆయన ఆరోపించడం జరిగింది. 

sushanth singh fathers lawyer made sensational comments on rhea
Author
Hyderabad, First Published Aug 28, 2020, 9:15 AM IST

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విచారణలో ఉండగా ఆయన తండ్రి కే కే సింగ్ తరపు న్యాయవాది రియా చక్రవర్తిపై సంచల ఆరోపణలు చేశారు. కేకే సింగ్ లాయర్ గా వ్యవహరిస్తున్న వికాస్ సింగ్ రియాకు సుశాంత్ పై ఏమాత్రం ప్రేమలేదు. కేవలం తన ఆర్థిక అవసరాల కోసం ఓ టిష్యు పేపర్ లా వాడుకుంది అన్నారు. నిన్న ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా చక్రవర్తి సుశాంత్ తో తనకు గల అనుబంధం అలాగే సుశాంత్ మానసిక స్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ డిప్రెషన్ కారణంగా వింతగా ప్రవర్తించే వాడని ఆమె చెప్పడం జరిగింది. 

దీనికి కౌంటర్ గా వికాస్ సింగ్ ఈ వ్యాఖ్యలను చేయడం జరిగింది. సుశాంత్ బ్రతికి ఉంటే రియా తన నుండి 500కోట్ల రూపాయలు లాక్కున్నా ఫ్యామిలీ మెంబర్స్ బాధపడేవారు కాదు. ఆయన మరణం తరువాత కుటుంబం బాధతో రియాపై చర్యలకు దిగారు అన్నారు. సుశాంత్ పై ఎటువంటి ప్రేమ లేని రియా తనని అవసరాల కోసం వాడుకుంది అన్నారు. 

రియా చెప్పినట్లుగా సుశాంత్ మానసిక వేదనతో బాధపడుతుంటే కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు అన్నారు. సుశాంత్ ని తన కంట్రోల్ లో ఉంచుకోవడానికి ఆమె ద్రవ ప్రధార్దాలలో మత్తుమందు కలిపి ఇచ్చేది. మత్తులో ఉన్న సమయంలో తనకు కావలసిన పనులు చేయించుకొనేదని లాయర్ చెప్పడం జరిగింది. రియాపై లాయర్ వికాస్ సింగ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios