‘పుష్ప’ కు కరోనా ఎఫెక్ట్, ప్రొడక్షన్ లో సుకుమార్ కోతలు
సుకుమార్, అల్లు అర్జున్ కలిసి డిస్కస్ చేసి నిర్మాతపై భారం తగ్గించేందుకు,కొంత బడ్జెట్ మరియు రెమ్యునేషన్స్ లో కోత పెట్టేందుకు చర్చలు జరుపనున్నట్లు సమాచారం. ఇలా ప్రాజెక్టులోని అన్ని అంశాలు ఇప్పుడు మార్పుకు లోనవుతున్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశం కోసం భారీ బడ్జెట్ కేటాయించారు. ఇందులోని ఆరు నిమిషాల సన్నివేశం కోసం రూ.6 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చిత్ర టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సీన్ సినిమాలోనే హైలైట్గా నిలుస్తుందని పేర్కొంది. అంతేకాదు ఈ సినిమా కోసం కేవలం భారత్ దేశంలోని టెక్నీషియన్స్ తో మాత్రమే పనిచేయబోతున్నారు. ఇది మేడిన్ ఇండియా ప్రాజెక్టని, భారత్లోని కళాకారులకు ఉపాధి కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని యూనిట్ పేర్కొంది. అయితే ఇప్పుడు కరోనా ప్రభావంతో ఇతర దేశాలకు వెళ్లే పరిస్దితి లేదు.
ఈ సినిమాని మొదట ధాయిలాండ్ వంటి ఫారిన్ లొకేషన్స్ లో ప్లాన్ చేసారు. స్క్రిప్టు ఆ విధంగా డిమాండ్ చేసింది కూడా. అయితే కరోనా ప్రభావంతో మొత్తం సుకుమార్,ఆయన టీమ్ కలిసి ప్లాన్ మార్చేసారు. స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసారు.ఏ విధమైన వేస్టేజ్ లేకుండా సుకుమార్ ఫెరఫెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఫారిన్ లొకేషన్స్ లో చేద్దామనుకున్న సీన్స్ మొత్తం ఇండియాలోని లొకేషన్స్ కు మార్చారు. అలాగే సుకుమార్, అల్లు అర్జున్ కలిసి డిస్కస్ చేసి నిర్మాతపై భారం తగ్గించేందుకు,కొంత బడ్జెట్ మరియు రెమ్యునేషన్స్ లో కోత పెట్టేందుకు చర్చలు జరుపనున్నట్లు సమాచారం. ఇలా ప్రాజెక్టులోని అన్ని అంశాలు ఇప్పుడు మార్పుకు లోనవుతున్నాయి.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ను ఇప్పటికే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ అభిమానులు ఎక్సపెక్టేషన్స్ పెంచుకున్నారు. ఈ స్టోరీ ..ఎర్ర చందనం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుందని వార్తలు వచ్చాయి. అది కన్ఫర్మ్ చేసింది ఫస్ట్ లుక్. అలాగే మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇదో ఫ్యామిలీ డ్రామా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే ఎమోషన్స్ తో కూడిన కథ అని తెలుస్తోంది. అయితే కేవలం భార్య,భర్తల మధ్య జరిగే కథ అయితే అల్లు అర్జున్ చెయ్యడు. అంతకు మించిన ఎమోషన్స్, కొన్ని వాస్తవిక సంఘటనలతో మిళితమై ఉంటుంది. అదే ప్లస్ పాయింట్ కానుంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్గా కనిపించబోతున్నారట.
‘అల వైకుంఠపురములో..’ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా ఇది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక హీరోయిన్. ప్రకాశ్రాజ్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, వెన్నెల కిశోర్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది.