చిరు చెప్పింది విని, డైరెక్టర్ కు మైండ్ బ్లాక్!
ఆ చిత్రం దర్శకుడు సుజీత్ అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు గ్యాప్ రావటంతో తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన చిరంజీవి ఈ విషయాన్ని ఫైనలైజ్ చేసి, ఆ డైరక్టర్ కు అడ్వాన్స్ పంపి, స్క్రిప్టు వర్క్ మొదలెట్టించారు. ఈ క్రమంలో సుజీత్ తన టీమ్ తో వీడియో కాల్స్ చేస్తూ ...డిస్కషన్ చేసి స్క్రిప్టు వర్క్ పూర్తి చేసినట్లు సమాచారం.
సూపర్ స్టార్ మోహన్లాల్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం లూసిఫర్. హీరో పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా రీమేక్ హక్కులను చిరంజీవి కోసం.. రామ్ చరణ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారా అని ఆసక్తికర చర్చ జరుగుతూండగానే దానికి బ్రేక్ ఇస్తూ చిరు..ఆ చిత్రం దర్శకుడు సుజీత్ అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు గ్యాప్ రావటంతో తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన చిరంజీవి ఈ విషయాన్ని ఫైనలైజ్ చేసి, ఆ డైరక్టర్ కు అడ్వాన్స్ పంపి, స్క్రిప్టు వర్క్ మొదలెట్టించారు. ఈ క్రమంలో సుజీత్ తన టీమ్ తో వీడియో కాల్స్ చేస్తూ ...డిస్కషన్ చేసి స్క్రిప్టు వర్క్ పూర్తి చేసినట్లు సమాచారం.
చిరంజీవి ఇమేజ్ కు తగినట్లు పూర్తి స్దాయిలో మార్పులు చేస్తూ తన స్టైల్ లో ట్విస్ట్ లు ఇస్తూ ఫినిష్ చేసారట. లాక్ డౌన్ పూర్తవగానే చిరంజీవికు నేరేషన్ ఇస్తారని తెలుస్తోంది. ఈ మేరకు చిరంజీవికి ఇన్ఫర్మేషన్ ఇస్తే రీరైట్ చేసి,మరింత మెరుగులు దిద్దమని పెద్ద బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ని నీ నుంచి ఆశిస్తున్నాను అని చెప్పి బూస్టింగ్ ఇచ్చినట్లు చెప్తున్నారు. అంతేకాకుండా చిరంజీవి ఈ స్క్రిప్టులో ఎక్కడెక్కడ ఏయే మార్పులు చేస్తే బాగుంటుందో చెప్పారట. ఆయన చెప్పిన మార్పులు విన్న డైరక్టర్ కు మైండ్ బ్లాక్ అయ్యిందిట. అంత ఫెరఫెక్ట్ గా తెలుగు నేటివిటికి మార్పులు చేసారట. వాటిని కలుపుకుంటూ స్క్రిప్టు పూర్తే నేరేషన్ విని తర్వాత చిరు కొన్ని మార్పులు చెప్పి స్క్రిప్టు లాక్ చేస్తారని , అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ యేడాది చివర్లో అంటే నవంబర్, డిసెంబర్ లో సినిమాని లాంచ్ చేస్తారని సమాచారం.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మించే ఈ చిత్రానికి త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. ‘లూసిఫర్’ మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 12న విడుదల చేసారు. అయితే సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను అకట్టుకోలేకపోయింది.
చిత్రం కథేమిటంటే... రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కె.అర్ (సచిన్ ఖేడేకర్) హఠాత్తు మరణం తరువాత ఆయన వారసుడు ఎవరనే చర్చ మొదలు అవుతుంది. రాష్ట్రం అంతా కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ? అని చర్చించుకుంటున్న నేపధ్యంలో ఈ సినిమా మొదలవుతుంది. అప్పుడు పి.కె.అర్ కి అత్యంత సన్నిహితుడు స్టీఫెన్ గట్టు పల్లి (మోహన్ లాల్)సీన్ లోకి వస్తారు. పి.కె.అర్ కి తను ఇచ్చిన మాట ప్రకారం ఆయన కుమార్తె ప్రియ (మంజు వారియర్)అండగా నిలబడి ఆమెను సమస్యల నుండి బయట పడేస్తాడు.
ఈ క్రమంలో ప్రియ రెండో భర్త బాబీ (వివేక్ ఒబెరాయ్) వల్ల స్టీఫెన్ కు రకరకాల సమస్యలు వస్తాయి. అంతే కాదు కొంతమంది స్వార్ధపూరిత ఆలోచనల కారణంగా స్టీఫెన్ పై కొన్ని నిందలు పడతాయి. ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్యన ప్రియ (మంజు వారియర్)ను సేవ్ చేయటం ప్రధానాంశంగా కథ నడుస్తుంది. అందుకోసం స్టీఫెన్ ఎలాంటి పరిస్ధితులను ఎదురుకున్నాడు? లాంటి విషయాలు చుట్టూ సినిమా తిరుగుతుంది.