`కేబీసీ`లో బిగ్బీతో రియల్ హీరో సోనూ సూద్.. కొత్త సంవత్సరం..కొత్త ప్రారంభం
కేబీసీలో సోనూ సూద్ సందడి చేశారు. తనపై రాసిన పుస్తకం `ఐ యామ్ నో మెస్సయ్య` పుస్తకాన్ని అందించారు. ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు. ఈ విషయాన్ని సోనూ సూద్ తెలిపారు.
లాక్ డౌన్లో రియల్ హీరోగా నిలిచిన తెర విలన్ సోనూ సూద్.. న్యూ ఇయర్ వేళ చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన ఆనందానికి అవదుల్లేకుండా పోయాయని చెప్పొచ్చు. కారణం.. ఆయన బిగ్బీ అమితాబ్ని కలిశారు. అమితాబ్ హోస్ట్ గా హిందీలో `కేబీసీ(కౌన్ బనేగా కరోడ్పతి) ప్రసారమవుతుంది.
తాజాగా కేబీసీలో సోనూ సూద్ సందడి చేశారు. తనపై రాసిన పుస్తకం `ఐ యామ్ నో మెస్సయ్య` పుస్తకాన్ని అందించారు. ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు. ఈ విషయాన్ని సోనూ సూద్ తెలిపారు. నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఏంటీ మార్గం అనుకున్నప్పుడు.. నేను ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రియమైన, ఆరాధించబడిన పురుషులలో ఒక్కరితో ఉన్నాను.
ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు కేబీసీలో నా పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాం. సోదరభావంతో ఉన్న ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడు బెస్ట్ చేస్తూనే ఉండండి` అని తెలిపారు. ఈ సందర్భంగా కేబీసీలో బిగ్బీతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఫోటోని పంచుకున్నారు సోనూ సూద్.
ఇదిలా ఉంటే ఇటీవల `ఆచార్య` సెట్లో చిరంజీవికి ఈ పుస్తకాన్ని అందించారు సోనూ సూద్. ఈ సందర్భంగా చిరంజీవితో దిగిన ఫోటోని పంచుకున్నారు. ఇక లాక్ డౌన్లో సోనూ సూద్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వాటికి రైటర్ మీనా అయ్యర్ `ఐ యామ్ నో మెస్సయ్య` పేరుతో పుస్తక రూపం ఇచ్చారు.