Asianet News TeluguAsianet News Telugu

ఇటలీలో తెలుగు సినీ స్టార్ సింగర్, ప్రత్యక్ష్య నరకమే!

ఇటలీ మొత్తం కరోనా వైరస్ తో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతోంది. ఇప్పటికే అక్కడ ఎనిమిది వేలకు పైగా మరణాలు రావటంతో... ఈ సింగర్ అక్కడ పరిస్దితిని తన  ఇన్‌స్టా ఎక్కౌంట్ ద్వారా చెప్తూ...ఇండియాలో అటు వంటి పరిస్దితి రాకుండా ఉండేలా చూసుకోమని సజెస్ట్ చేస్తూ వీడియో వదిలింది.

Shweta Pandit on being in lockdown in Italy
Author
Hyderabad, First Published Mar 26, 2020, 10:29 AM IST

శ్వేతా పండిట్ గుర్తుందా....కొత్త బంగారు లోకం సినిమాలో "నేనని నీవని", సైజు జీరో సినిమాలో "మెల్ల మెల్ల", సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో సమంత సోలో సాంగ్ ఇలా పలు హిట్ సాంగ్స్ పాడింది శ్వేత. ఆమె ఇప్పుడు తాను బిక్కు బిక్కుమంటూ ఇటలీలో బ్రతుకుతున్నానంటూ ఆవేదనతో చెప్పుకొచ్చింది. తెలుగులో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన ఆమె ఇటిలీలో సెటిలైంది. అయితే అక్కడ పరిస్దితి లు ఏ మాత్రం బాగోలేవు. ఇటలీ మొత్తం కరోనా వైరస్ తో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతోంది. ఇప్పటికే అక్కడ ఎనిమిది వేలకు పైగా మరణాలు రావటంతో... ఈ సింగర్ అక్కడ పరిస్దితిని తన  ఇన్‌స్టా ఎక్కౌంట్ ద్వారా చెప్తూ...ఇండియాలో అటు వంటి పరిస్దితి రాకుండా ఉండేలా చూసుకోమని సజెస్ట్ చేస్తూ వీడియో వదిలింది.
  
ఎప్పుడైతే కరోనా వైరస్ అనేది వచ్చిందో అప్పట్నుంచి తను ఇంటి నుంచి బయటకు రాలేదని, ఇప్పటికీ ఇంట్లోనే ఉంటున్నానని.. తన అభిమానులు, తల్లిదండ్రుల ప్రేమ వల్ల తను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానని చెప్పుకొచ్చింది శ్వేతాపండిట్. దాదాపు 5 నిమిషాల వీడియోను ఆమె పోస్ట్ చేసింది. ఇటలీ దుర్భర పరిస్థితిని కళ్లకుకట్టింది. అలాగే .  ప్రజలు.. ముఖ్యంగా భారతీయులు కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)ను చాలా తేలికగా తీసుకుంటున్నారని  శ్వేతా పండిట్‌ అన్నారు.   ఇప్పటికైనా భారతీయులు నిర్లక్ష్యధోరణిని వదిలేసి ప్రభుత్వం చెబుతున్న నియమాలను పాటించాలని, ప్రయాణాలు చేయడం మానేసి ఇంట్లోనే ఉండాలని ఆమె కోరారు.


ఈ వీడియోలో ఏముందంటే.. ‘మీరందరూ కరోనా వైరస్‌ గురించి వినే ఉంటారు. ప్రస్తుతం అది ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలను సృష్టిస్తోంది. దీని నివారణ చర్యల్లో భాగంగా భారతదేశం కూడా పూర్తి లాక్‌డౌన్‌ను ప్రకటించింది. నిజం చెప్పాలంటే లాక్‌డౌన్‌ కీలకమైన చర్య. ప్రపంచం మొత్తం మీద కరోనా వైరస్‌ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇటలీలో ప్రస్తుతం నేను ఉన్నాను. గత కొన్నిరోజులుగా నా నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్నా. 

మనకి ఎప్పుడు? ఎలా? వచ్చిందనే విషయాన్ని కూడా తెలుసుకోలేని ఒక రకమైన వ్యాధి కరోనా. మనకి వచ్చింది సాధారణ జలుబా? లేక కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షనా? అనేది కూడా తెలుసుకోలేం. అలా మనం ఆస్పత్రికి వెళ్లి డాక్టర్స్ ను సంప్రదించేటప్పటికే.. చాలా ఆలస్యమైపోయింది. ఐసీయూలో పెట్టి ఆక్సిజన్‌ అందిస్తారు. కొన్నిసార్లు అలా ఆస్పత్రిలో చేరిన వ్యక్తి కొన్నిరోజులకే మరణిస్తాడు. ఇది జోక్‌ కాదు. చాలా ప్రమాదకరమైనది.

 ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లిష్ట పరిస్థితులను చూస్తుంటే నాకెంతో బాధగా అనిపిస్తోంది. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పటికే 8వేల మంది కరోనా వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రతిరోజూ అంబులెన్స్‌ సైరెన్‌తో నేను నిద్రలేస్తున్నాను. ఇది నిజం. ప్రజలు నాకు ఫోన్‌ చేసి నా బాగోగులు గురించి అడిగి తెలుసుకుంటున్నారు. వారి ప్రార్థనలు, దేవుడి ఆశీస్సుల వల్లే నేను ఇంకా ఆరోగ్యంగా ఇంట్లోనే ఉండగలిగాను.’

‘ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అమెరికా, లండన్‌, ఇప్పుడు భారత్‌. ఇటలీకి అది ఎలా వ్యాపించిందని చాలా మంది నన్ను అడిగారు. మాకు కూడా నిజం ఏమిటనేది పూర్తిగా తెలియదు. మేం దాని గురించి తెలుసుకునే సమయానికి ఆ మహమ్మారి దాని రెక్కలను ఇటలీ అంతా వ్యాప్తి చేసేసింది. ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను. అందుకే హోలీ వేడుకల కోసం ఏదో ఒక విమానంలో భారత్‌కు రావాలని అనుకున్నా. కానీ నా ద్వారా ఆ వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించడం నాకు ఇష్టం లేదు.

నువ్వు కలిసే వ్యక్తికి కరోనా వైరస్‌ ఉందో లేదో కూడా నువ్వు తెలుసుకోలేవు. అందుకే నేను ఇలా ఇటలీలోనే ఉన్నాను. అందరూ కలిసి పోరాడి.. ఆ వైరస్‌ను నశించేలా చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండండి. చేతులను శుభ్రంగా కడుక్కోండి. కుటుంబసభ్యులతో మాట్లాడినా సరే.. దూరం పాటించండి’ అని ఆమె అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios