బిగ్ బాస్లో పాల్గొనటంపై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్
బిగ్ బాస్లో పాల్గొనాలంటూ తనను ఎవరూ సంప్రదించలేదని, తాను బిగ్ బాస్లో పాల్గొన బోతున్నట్టు, ఇప్పటికే తన పేరును కన్ఫామ్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలు ఇక ఆపాలని కోరింది హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్. అంతేకాదు ఇక మీద అలాంటి వార్తల రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్వీటర్ ద్వారా తెలిపింది.
తెలుగులో మరోసారి బిగ్ బాస్ సందడి మొదలైంది. ఇప్పటికే మూడు సీజన్లు సూపర్ హిట్ కాగా తాజాగా మరో సీజన్ను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు నిర్వాహకులు. ఇప్పటికే ఈ మేరకు ప్రచార చిత్రం కూడా రిలీజ్ అయ్యింది. మూడో సీజన్కు వ్యాఖ్యతగా వ్యవహరించిన కింగ్ నాగార్జున నాలుగో సీజన్కు కూడా హోస్ట్గా వ్యవహరించనున్నారు. అయితే ఇప్పటికే ఈ షోలో పాల్గొన బోయే కంటెస్టెంట్లపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ లిస్ట్లో తరుణ్, బిత్తిరి సత్తి, శ్రద్దాదాస్, యాంకర్ ఝాన్సీ, సింగర్ సునీత లాంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో హీరో తరుణ్ ఇప్పటికే తాను బిగ్ బాస్లో పాల్గొనటం లేదని క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఈ వార్తలపై శ్రద్ధా దాస్ కూడా స్పందించింది. బిగ్ బాస్లో పాల్గొనాలంటూ తనను ఎవరూ సంప్రదించలేదని, తాను బిగ్ బాస్లో పాల్గొన బోతున్నట్టు, ఇప్పటికే తన పేరును కన్ఫామ్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలు ఇక ఆపాలని కోరింది. అంతేకాదు ఇక మీద అలాంటి వార్తల రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్వీటర్ ద్వారా తెలిపింది.
గత సీజన్ టెలికాస్ట్ సమయంలోనే శ్రద్ధాదాస్ బిగ్ బాస్ హౌస్లో పాల్గొన బోతుందన్న ప్రచారం జరిగింది. ఈ సారి కరోనా నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. షోలో పాల్గొన బోయే కంటెస్టెంట్లకు పరీక్షలు చేయటంతోపాటు వారు షోలో పాల్గొనటానికి ముందు 15 రోజుల పాటు క్వారెంటైన్లో ఉండాలన్న నిబంధన పెట్టినట్టుగా తెలుస్తోంది.